ఏపీ సాక్షిని ప్రశ్నించిన టీ.లాయర్..
21:43 - April 13, 2018

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్లో ఏపీ సాక్షిని ప్రశ్నించడం పూర్తైంది. మూడు రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. ఏపీ సాక్షి, వ్యవసారంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సమాధానాలు వేగంగా చెప్పాలని ఒకదశలో సత్యనారాయణకు ట్రైబ్యునల్ సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 7 నుంచి 9 వరకు జరుగుతుంది.