పట్టాలు తప్పిన గూడ్స్ రైల్..పలు రైళ్లు రద్దు..
07:01 - January 6, 2017
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ వీర్గాం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. కాగజ్నగర్లో దర్బంగా, నాగపూర్ ప్యాసింజర్.. మంచిర్యాలలో చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రావాల్సిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దైంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్లైన్ ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్- 04027786170, 27700868, 27786539, 27788889, ఖమ్మం-08742234541, కాజీపేట్- 08702576430, 2576266, 2576430, వరంగల్-08702426232, సర్పూర్ కాగజ్నగర్-08738238717 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.