ఫుట్ బ్రిడ్జి ప్రమాదంలో బయటపడ్డ15 మంది
10:56 - May 19, 2017
పనాజీ : దక్షిణగోవాలో సన్వొర్డెమ్ నదిపై ఫుట్బ్రిడ్జ్ కూలి 50 మంది గల్లంతైన ఘటనలో 15 మందిని రెస్క్యూ టీం కాపాడింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహాన్ని నీటి నుంచి వెలికి తీశారు. ఫుట్బ్రిడ్జ్పై నుంచి ఓ యువకుడు నదిలో దూకడంతో అతడిని కాపాడేందుకు పోలీసులు యత్నిస్తుండగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన పోర్చుగీసు కాలం నాటిది. మరోవైపు ఫుట్బ్రిడ్జ్ కూలిన ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవా సిఎం మనోహర్ పారికర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.