విజయం

ముంబై : రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 11వ సీజన్ను ఘనంగా ప్రారంభించింది. ఐపీఎల్ ఆరంబ మ్యాచ్లో అదరగొట్టింది. అభిమానులకు అసలైన టీ20 మజాను అందించింది. ముంబైతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల ధాటికి 105పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ చెన్నైని.. ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో మెరుపు ఇన్నింగ్స్తో విజయతీరాలకు చేర్చాడు. 68 పరుగులు చేసిన బ్రావో 18వ ఓవర్లో ఔటయ్యాడు. రిటైర్డ్హర్ట్గా క్రీజు వదిలి వెళ్లిన కేదార్ జాదవ్ మళ్లీ బ్యాటింగ్ దిగి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. ముంబయి బౌలర్లలో మర్కాండే, హర్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి ఇండియన్స్ను ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నైకి అద్భుత విజయాన్ని అందించిన బ్రావోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 108 ఓట్లు పోలయ్యాయి. అందులో 107 ఓట్లు చెల్లింపయ్యాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీనితో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బరిలో నిలిచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు బండ ప్రకాష్ కు 33 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు 10 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఏజెంట్ కు ఓటును స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూపించడంతో ఆయన ఓటును పరిగణలోకి తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ సూచించింది. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ముక్కోణపు టీ20 సిరీస్లో లంకపై భారత్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి మ్యాచ్లో ఓడినదానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టాస్ గెలిచిన భారత్... శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. లంక ఓపెనర్స్ కుశాల్ మెండిస్ 38 బంతుల్లో 55 రన్స్ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ గుణతిలక 17రన్స్ చేసి నిరాశపరిచాడు. మిగతా బ్యాట్స్మెన్ ఒకటి , రెండు మెరుపులతో నిష్క్రమిస్తున్నా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చక్కటి షాట్లు కొట్టాడు. ఆడిన తొలి బంతినే సిక్స్ కొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ భారత్ బౌలర్ల ముందు నిలువలేక పోయారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేశారు. 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన లంక కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో ఠాకూర్ 4వికెట్లు తీయగా... సుందర్ 2, చాహల్, శంకర్, ఉనద్కత్ తలా ఒక వికెట్ తీశారు. 153 పరుగుల బరిలోకి దిగిన ఇండియా తక్కువ స్కోరుకే ఓపెనర్లు రోహిత్శర్మ, శిఖర్ధావన్ వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 11 పరుగులకే ఔటై నిరాశపర్చాడు. మంచి ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్ కూడా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 22 రన్స్ దగ్గర ఓపెనర్ల వికెట్లు కోల్పియింది. ఆతర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, రైనా వేంగా పరుగులు జోడించి రన్రేట్ పడిపోకుండా చూశారు. వీరు 3.4 ఓవర్లలోనే 40 పరుగులు సాధించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటుంగా ప్రదీప్ బౌలింగ్లో రైనా షాట్కు యత్నించి అవుటయ్యాడు. మూడు ఓవర్ల అనంతరం రాహుల్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. అప్పటికి విజయానికి 55 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజ్లోకి వచ్చిన పాండే, కార్తీక్ కుదురుకుని... బౌండరీలు బాదుతూ..సింగిల్స్, డబుల్స్ తీస్తూ పని పూర్తి చేశారు. ఇంకా 9 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖరారు చేశారు. శార్దుల్ ఠాకూర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఢిల్లీ : టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కోహ్లీ సేన కైవసం చేసుకుంది. గతంలో ఆరుసార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్ను గెలవని భారత్... ఈసారి ఆ ఘనతను సాధించి వన్డే ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో కొనసాగుతోంది. పోర్ట్ ఎలిజబెత్లో జరిగిన చివరి వన్డే భారత్ దక్షిణాఫ్రికా 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల చేసింది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్శర్మ ఈ వన్డేలో చెలరేగి ఆడాడు. శిఖర్ ధావన్ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 105 పరుగుల వద్ద సమన్వయలోపంతో కోహ్లీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రహానే కూడా రనౌట్ అయి వెనుదిరిగాడు. మరోవైపు రోహిత్ మాత్రం చెలరేగి ఆడడంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది. ఈ వన్డే రోహిత్ 126 పరుగులు చేయడంతో... వన్డే కెరీర్లో 17 సెంచరీలు నమోదయ్యాయి.
అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఆమ్లా, మార్క్రమ్ రెచ్చిపోయారు. ఆరో ఓవర్లో శ్రేయాస్ క్యాచ్ వదిలేయడంఓ 9 పరుగల వద్ద ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న మార్క్రమ్ వెంటవెంటనే మూడు బౌండరీలు, సిక్స్లతో చెలరేగిపోయాడు. అయితే.. పదో ఓవర్లో బూమ్రా మార్క్రమ్ను పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత డుమిని, డివిల్లీర్స్ల వికెట్లను హర్దిక్ పడగొట్టి దక్షిణాఫ్రికాను టెన్షన్లో పడేశాడు. అయితే మరో ఎండ్లో ఉన్న ఆమ్లాకు డేవిడ్ మిల్లర్ తోడయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఒకానొక దశలో గెలుస్తుందేమోనని అనిపించింది. కానీ... చాహల్ అద్భుత బంతితో మిల్లర్ను ఔట్ చేయడంతో భారత్లో ఆనందం నిండింది. ఆ తర్వాత ఆమ్లాను పాండ్యా డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆమ్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. తన జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ.. 71 పరుగుల చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత 42వ ఓవర్లో కుల్దీప్ మూడు వికెట్లు తీసి భారత్ను గెలుపునకు చేరువ చేశాడు. ఆ తర్వాత 42.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తానికి వన్డే ఓటమితో కసి పెంచుకున్న కోహ్లీ సేన ఐదో వన్డేలో ఘన విజయం సాధించి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకుని టీమిండియా రికార్డ్ సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ : ధర్మశాల వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంక 20.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ 112 ఆలౌట్ కాగా శ్రీలంక మూడు వికెట్లకు 114 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1..0 ఆధిక్యంలో శ్రీలంక నిలిచింది.

గుజరాత్ : రెండో టీ20లో న్యూజిలాండ్ మెరిసింది. టీమ్ ఇండియాపై అద్భుత విజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్జట్టు 196 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్మెన్ కొలిన్ మన్రో వీరవిహారం చేశాడు. 58 బంతుల్లోలనే 109 రన్స్ చేశాడు. మార్టిన్ గప్తిల్ 45రన్స్ చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. 197 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా... మొదటి నుంచి తడబడింది. కెప్టెన్ విరాట్కోహ్లీ 65 రన్స్, ఎంఎస్ ధోని 49 రన్స్ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. కివీస్ బౌలర్ ట్రెంట్బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి భారత్ నడ్డివిరిచాడు. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మన్రోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ 1-1తో సమం కావడంతో మంగళవారం తిరువనంతపురంలో జరిగే మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక రెండు జట్లు చావోరేవో అక్కడే తేల్చుకోనున్నాయి.

ఢిల్లీ : ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ దుమ్ములేపింది. పూల్ ఏ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 3..1తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్ 9 పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. చింగల్సేన 13 నిమిషంలో, రమణ్దీప్ సింగ్ 44 నిమిషంలో, హర్మన్ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో గోల్ కొట్టారు. పాక్లో అలీషాన్ ఒక్కడే గోల్ చేయగలిగాడు. టోర్నీలో భారత్కిది వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్లో జపాన్ను 5..1, రెండో మ్యాచ్లో బంగ్లాను 7...0తో చిత్తుచిత్తుగా ఓడించింది.

జార్ఖండ్ : తొలి టీ ట్వంటీలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. వర్షం అడ్డంకిగా మారినా విరాట్ ఆర్మీ ఆసిస్ను కంగారెత్తించింది. రాంచీ మ్యాచ్ విజయంలో బౌలర్లు అదరగొట్టారు. ఏకంగా ఐదుగురు ఆసిస్ బ్యాట్స్మెన్ క్లీన్బౌల్డ్ చేసి సత్తా చాటారు. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1...0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
అదరగొట్టిన కోహ్లీ బ్యాచ్
రాంచీ టీ ట్వంటీ మ్యాచ్లో కోహ్లీ బ్యాచ్ అదరగొట్టింది. పొట్టిఫార్మాట్లో బాయ్స్ మరోసారి సత్తా చాటారు. 9వికెట్ల తేడాతో కంగారులను చిత్తుచేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వర్షం కారణంగా గంటన్నరపాటు మ్యాచ్కు అంతరాయం కలిగింది. దీంతో డక్వర్త్లూయిస్ పద్దతి అనుసరించి భారత్కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన భారత్ 5.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది.భారత్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ11, శిఖర్ ధావన్ 15, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు.
భారత్ 1-0 ఆధిక్యం
అంతకు ముందు టాస్ గెలిచిన కెప్టెన్కోహ్లీ బౌలింగ్ను ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని భారత బౌలర్లు వమ్ము కానివ్వలేదు. వరుసగా రెండు ఫోర్లు బాది వూపు మీదున్న కెప్టెన్ వార్నర్ ను భువనేశ్వర్ క్లీన్బౌల్డ్ చేసి వికెట్ల కూల్చేపని మొదలు పెట్టాడు. మరోవైపు ఓపెనర్ ఫించ్ 42 పరుగులు చేసినా.. మాక్స్వెల్ 17, హెడ్ 9, హెన్రిక్స్8 , క్రిస్టియన్ 9లకే పెవిలియన్ చేరారు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన పెయిన్17, నైల్ 1 స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బ్యాట్స్మెన్లలో ఐదుగురు క్లీన్బౌల్డ్ అయ్యారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ 2, బుమ్రా 2, భువనేశ్వర్, పాండ్య, చాహల్ తలో వికెట్ తీశారు. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్, 2 ఏరియాల్లో సీఐటీయూ విజయం సాధించాయి.
ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్ ఆధిక్యత
సింగరేణి ఫలితాల్లో టీబీజీకేఎస్ విజయబావుటా ఎగుర వేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, మణుగూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కార్మికులు పటాసులు కాలుస్తూ ఆనందం పంచుకున్నారు.
అత్యధిక స్థానాల్లో టీబీజీకేఎస్ గెలుపు
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ని విజయం వరించింది. అటు ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్ గెలుపొందింది. బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.అటు శ్రీరాంపూర్ఏరియాలో టీబీజీకేఎస్ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక రామగుండం 1,2,3 ఏరియాల్లో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయబావుటా ఎగురవేసింది.
రెండు చోట్ల ఏఐటీయూసీ విజయం
ఇక విపక్ష యూనియన్ల ఉమ్మడి అభ్యర్థులు రెండు చోట్ల విజయదుందుబి మోగించారు. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అటు భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ ఓట్ల మెజారిటీలో విజయం సాధించింది.
17 కార్మిక సంఘాలు పోటీ
సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం , సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్ తరఫున టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులకు పలు తాయిలాలు, పథకాలను ప్రకటించడంతోపాటు.. టీబీజీకేఎస్లోకి ఇతర సంఘాల నేతల వలసలు భారీగా ప్రోత్సహించారు. దీంతో పరిస్థితి టీబీజీకేఎస్ వైపు మొగ్గిందనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఇండోర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోపోయి 294పరుగుల లక్ష్యాన్ని చేధిచింది. 5 వన్డేల సిరీస్ ను భారత్ 3_1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో పాండ్యా, రోహిత్, రహానే హాఫ్ సెంచరీలతో రాణించారు.
Pages
Don't Miss
