Pawan Kalyan

హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రకంపనాలు జరుగుతూనే ఉన్నాయి. క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ఏకంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం...దీనివెనుక తానున్నట్లు వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొనడంతో మెగా ఫ్యామిలీ తీవ్రంగా స్పందించింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పవన్ వచ్చారన్న విషయం దావానంలా వ్యాపించడంతో 'మా' అసోసియేషన్ సభ్యులు, అభిమానులు చేరుకున్నారు. తన తల్లికి న్యాయం జరిగేవంతవరకు ఇక్కడి నుండి కదిలి వెళ్లనని పవన్ భీష్మించుకూర్చొవడంతో ఉత్కంఠ రేగింది. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం నుండి అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ లు చేరుకున్నారు. కాసేపు నిరసన తెలిపిన పవన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పవన్ కు పోలీసులు నచ్చచెప్పడంతో ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. కానీ తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కాసేపట్లో 'మా' కార్యాలయానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ : క్యాస్టింగ్కౌచ్.. ఈ అంశం ఇపుడు టాలీవుడ్ను కుదిపివేస్తోంది. నటి శ్రీరెడ్డి యాక్షన్ సీన్లు.. దానికి మిగతా నటుల రియాక్షన్స్... ఇలా ఫిల్మ్నగర్లో నెలరోజులుగా కలర్ఫుల్ చిత్రం నడుస్తోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణలపై సినీతారాలోకం ఫైరవుతోంది. పవన్పై శ్రీరెడ్డి ఆరోపణలను నాగబాబు ఖండించగా.. తన ఫ్యామిలీపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను జీవితా రాజశేఖర్ కూడా తిప్పికొట్టారు. తన వ్యాఖ్యలపై అందరూ విమర్శలు చేస్తుండడంతో.. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ తల్లికి, పవన్కల్యాణ్కు ట్విట్టర్ మూలంగా క్షమాపణలు చెప్పారు.
కార్చిచ్చులా రగులుతున్న కాస్టింగ్ కౌచ్
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం... కార్చిచ్చులా రగులుతూనే ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఫిల్మ్నగర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటి మాధవీలత.. పవన్పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్షకు కూర్చున్నారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్నారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మాధవీలత తీవ్రంగా తప్పుబట్టారు.
కాస్టింగ్ కౌచ్పై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై మెగాబ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూసేట్లుంటే.. తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తెస్తానని ప్రశ్నించారు. మా అసోసియేషన్లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. పవన్ కల్యాణ్పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. పరిశ్రమలో ఎవరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకునేది లేదన్నారు నాగబాబు.
శ్రీరెడ్డి విషయంలో నాపై తప్పుడు ఆరోపణలు ప్రచారం : జీవితారాజశేఖర్
మరోవైపు శ్రీరెడ్డి విషయంలో ఓ చానల్ తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసిందని జీవితారాజశేఖర్ ఫైరయ్యారు. క్యాస్టింగ్కౌచ్పై వేయబోయే కమిటీలో తన పేరు ఉన్నట్టు తెలుసుకుని పథకం ప్రకారం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనపై తన ఫ్యామిలీ మెంబర్స్పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని జీవిత హెచ్చరించారు.
ట్విట్టర్ లో శ్రీరెడ్డి విచిత్రమైన పోస్టులు.. కలకలం
ఇదిలావుంటే నటి శ్రీరెడ్డి ఇవాళ ట్విట్టర్ మూలకంగా కొన్ని విచిత్రమైన పోస్టులు చేసి కలకలం సృష్టించాయి. పవన్ కల్యాణ్పై ఒంటికాలిపై లేచి.. దుర్భాషలాడిన శ్రీరెడ్డి.. బుధవారం.. ట్విట్టర్ మూలకంగా పవన్కు, ఆయన తల్లికీ క్షమాపణలు చెప్పారు. అంతేలోనే.. ఈ వ్యవహారంలో తాను ఒంటరినయ్యానని.. సహకరించిన వారికి ధన్యవాదాలు అనీ పోస్ట్ చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. అంతలోనే.. స్టేషన్లో కేసు పెట్టాలన్న పవన్ మాటలను పాటిస్తానని, నటి జీవితా రాజశేఖర్ నుంచే కేసుల పర్వం ప్రారంభిస్తానని మరో ట్వీట్ చేశారు. మొత్తానికి శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడు భాషలకు అతీతంగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది.
విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. నెలరోజుల క్రితమే తనకు భద్రత కల్పించాలని కోరుతూ పవన్కల్యాణ్ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పవన్కు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే పవన్ తన గన్మెన్లను వెనక్కి పంపించారు. పార్టీ వ్యవహారాలు చేరవేసేందుకు ప్రభుత్వం గన్మెన్లను వాడుకుంటోందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకోసమే వారిని వెనక్కి పంపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న కాస్టింగ్ కౌచ్ అంశంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూస్తే తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకువస్తానన్నారు. మా అసోసియేషన్లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అయితే మాలో సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు తాను వ్యతిరేకమన్నారు నాగబాబు. పవన్ కల్యాణ్పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. ఎవ్వరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకోమన్నారు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. సమస్యలు ఉంటే పోలీస్ స్టషన్ కు వెళ్లండి అని చెప్పిన పవన్ గారి మాటలను అనుసరిస్తానని అన్నారు.
తూ.గోదావరి : ఈనెల 16న విపక్షపార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్కు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో బంద్ నిర్వహించుకోవాలన్నారు. శాంతియుత పద్దతిలో నిరసనలు తెలిపితే ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు ఏపీ హోం మంత్రి.

హైదరాబాద్ : ఆడ పిల్లల్ని వేధించే ఈవ్ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలన్నారు. ఆడపిల్లల జోలికి వెళ్తే వారి తోలు తీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మానవ మృగాల సామూహిక అత్యాచారం, హత్య ఘటన తనను ఎంతో బాధించిందన్నారు. కథువా ఘటనను ఖండిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పవన్ మౌన ప్రదర్శన చేపట్టారు. నిర్భయ చట్టం కూడా.. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే వచ్చిందన్న పవన్... సింగపూర్ తరహాలో శిక్షలు అమలు చేయాలని అప్పుడే అందరికీ భయం పుడుతుందన్నారు. జనసేన తరఫున.. ఆడపిల్లల్ని రక్షించుకునేందుకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చట్టం బలహీనుల విషయంలో బలంగా, బలవంతుల విషయంలో బలహీనంగా పనిచేస్తోందని పవన్ అన్నారు. ఈ విధానంలో మార్పు వచ్చేలా పోరాడతామన్నారు.
అనంతపురం : ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్లో ప్రజలందరూ స్వచ్చంధంగా పాల్గొనాలని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బంద్ బాధాకరమైన తప్పని సరిస్థితుల్లోనే పిలుపు ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన అవినీతిలో టీడీపీ, బీజేపీలకు సమాన బాధ్యత ఉందని చలసాని విమర్శించారు.
ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అధికారం కావాలనే కాంక్ష అక్కడి పార్టీల్లో ఉందని..ప్రజలను ఏదీ ఆకర్షిస్తుంది ? తదితర విషయాలపై రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా ఉపయోగపడుతుందని అనుకున్న పార్టీలు ఆ దిశగా వ్యూహాలు రచించాయన్నారు. ప్రస్తుతం హోదాపై మాట్లాడుతున్న పార్టీలు నాలుగేళ్లు ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ..టిడిపి రెండు పార్టీలు బీజేపీతో మితృత్వం మెంటేన్ చేశాయని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తరువాత కూడా మద్దతినిచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
హోదా అన్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ ఇదే ప్రభుత్వం హోదా కావాలంటూ ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వస్తున్నారన్నారు. టిడిపికి కోరిక కలిగినప్పుడే అందరికీ కోరిక కలగాలనే విధంగా వ్యవహరిస్తోందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం..అంతకన్నా గొప్పది ప్యాకేజీ అంటూ టిడిపి సవాలక్ష మాటలు చెప్పిందని గుర్తు చేశారు. వామపక్షాలిచ్చిన బంద్ విజయవంతం కాగానే టర్న్ తీసుకుందని తెలిపారు.
ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారని కానీ నరేంద్ర మోడీ దుర్మార్గం..అన్యాయం..నమ్మక ద్రోహం చేశాడని అనడం లేదన్నారు. కేంద్రం..బిజెపి అంటూ విమర్శలు గుప్పిస్తారని..ఎక్కడో ఒకసారి మోడీ అంటారని తెలిపారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది....ప్రామీస్ చేసింది మోడీ అని తెలిపారు. ఎక్కడైనా నరేంద్ర మోడీ ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ అన్నాడా ? అని ప్రశ్నించారు.
కర్నాటకలో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ ఎందుకు పిలుపు ఇవ్వడని సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి చంద్రబాబు నాయుడు మాత్రమే శత్రువు..బీజేపీ మాత్రం శత్రువు కాదన్నారు. స్వాతంత్రం ఇవ్వనని బ్రిటీష్...తెలంగాణ ఇవ్వదని కాంగ్రెస్...చెప్పిందని మరి ఎందుకు పోరాడారు ? ఏం చేస్తే హోదా వస్తుందో చెప్పాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి పెడుతుంటే సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా వచ్చే ప్రభుత్వమైనా ఇవ్వాల్సి ఉంటుందని,
కర్నాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మాత్రం జనతాదళ్ సెక్యూలర్ కాంగ్రెస్...బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందని..ఇక్కడ కేసీఆర్ ఆశించింది జరగదు కదా ? అని తెలిపారు. ఆంధ్రా జేఏసీగా ఎందుకు ఏర్పాటు కాదు ? అని తెలిపారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.
విజయవాడ : ప్రత్యేకహోదా పోరును మరింత ఉధృతం చేసే దిశగా లెఫ్ట్పార్టీలు, జనసేన అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో సంయుక్తంగా పాదయాత్ర నిర్వహించిన ఈ పార్టీలు.... మరోపోరుకు సిద్ధమవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి. ఈనెల 16న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు, జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించిన లెఫ్ట్ ,జనసేన పార్టీలు మరో పోరుకు సిద్ధమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్లో పవన్ కల్యాణ్తో సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏం చేయాలన్నదానిపై వీరు చర్చించారు. విజయవాడలో లెఫ్ట్, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. భవిష్యత్లో ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 16న జరిగే ఏపీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్ను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు.
అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళంలో ప్రత్యేకహోదా కోరుతూ నిర్వహించిన బహిరంగ సభలు వాయిదా వేశారు. ఈనెల 15న జరుగనున్న సభనూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర బంద్ తర్వాత తేదీలను ప్రకటించనున్నారు. విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మేధావులతోనూ సమావేశాలు నిర్వహించాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని లెఫ్ట్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఎవరిమీద దీక్ష చేస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని దీక్ష ఓ నాటకమని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా సాధనకు టీడీపీ, వైసీపీతోపాటు బీజేపీ నేతలపైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రజల్లో హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టేందుకు వ్యూహరచన చేశారు.
Pages
Don't Miss
