south africa

డర్బన్ : టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్కు టీమిండియా,సౌతాఫ్రికా సై అంటే సై అంటున్నాయి. ఆఖరి టీ20కి కేప్టౌన్లో రంగం సిద్ధమైంది.తొలి టీ20లో టీమిండియా తిరుగులేని విజయం సాధించింది.డూ ఆర్ డై సెకండ్ టీ20లో సౌతాఫ్రికా జట్టు సంచలన విజయం సాధించింది.సఫారీ గడ్డపై తొలి సారిగా టీ20 సిరీస్ నెగ్గాలని టీమిండియా పట్టుదలతో ఉండగా...సెకండ్ టీ20 విజయంతో జోరు మీదున్న సౌతాఫ్రికా సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 12 టీ20ల్లో పోటీ పడగా...భారత్ 7 మ్యాచ్ల్లో మాత్రమే నెగ్గింది.5 మ్యాచ్ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది.సౌతాఫ్రికాలో తొలి టీ20 సిరీస్ నెగ్గాలంటే మాత్రం ఆఖరి టీ20లో టీమిండియా అంచనాలకు మించి రాణించాల్సిందే.
ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో ఎదురులేని ఇండియా.. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. వన్డే టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికా, సెకండ్ ర్యాంకర్ భారత్ మధ్య తొలి టీ20కి వాండరర్స్ స్టేడియంలో రంగం సిద్ధమైంది.వన్డే సిరీస్ నెగ్గి జోరు మీదున్న విరాట్ కొహ్లీ అండ్ కో టీ20ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది.
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో టీమిండియా,సౌతాఫ్రికా మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. తొలి టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా....సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్ల సిరీస్కు సై అంటోంది. జొహన్నెస్బర్గ్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లో టీ20 3వ ర్యాంకర్ భారత్కు 6వ ర్యాంకర్ సౌతాఫ్రికా సవాల్ విసురుతోంది.
వన్డే సిరీస్ విజయంతో విరాట్ కొహ్లీ అండ్ కో జోరు మీదుంది. ఆల్రౌండ్ పవర్తో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా..టీ20 సిరీస్ సైతం నెగ్గి చరిత్రను తిరగరాయాలని ప్లాన్లో ఉంది. వన్డే సిరీస్లో తేలిపోయిన సౌతాఫ్రికా జట్టు టీ20ల్లో డుమిని సారధ్యంలో బరిలోకి దిగనుంది.వన్డే సిరీస్ ఓటమికి భారత్పై బదులు తీర్చుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది.
టీ20 ఫేస్ టు ఫేస్ రికార్డ్లో దక్షిణాఫ్రికాపై భారత్దే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 10 టీ20ల్లో పోటీ పడగా...భారత్ 6 మ్యాచ్ల్లో మాత్రమే నెగ్గింది. 4 మ్యాచ్ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో తిరుగులేని టీమిండియాకే తొలి టీ20లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఢిల్లీ : డర్బన్ వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. కోహ్లీసేన సఫారీ జట్టుకు చుక్కులు చూపించింది. 6వికెట్లతేడాతో ఆతిథ్యజట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. మొత్తం ఐదువన్డేల సిరీస్లో 1-0తో టీమ్ఇండియా ముందంజవేసింది. విరాట్ ఆర్మీ మరోసారి దుమ్మురేపింది. కోహ్లీసేన దూకుడు ముందు డూప్లెసిస్ బ్యాచ్ విలవిల్లాడింది. 270 పరుగుల టార్గెట్ను టీమిండియా ఈజీగా ఛేదించింది. భారత్ విజయంలో విరాట్ మరోసారి కీలకంగా మారాడు. మొత్తం 119 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10ఫోర్లతో 112 రన్స్ సాధించాడు. అటు రహానే 86 బంతుల్లో 5ఫోర్లు, 2భారీ సిక్స్లతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 79 పరుగులు సాధించిన రహానే కెప్టెన్ కోహ్లీకి సరిజోడు అనిపించుకున్నాడు.
కోహ్లిసేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ20 పరుగులు, శిఖర్ ధవన్ 35 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సారధి కోహ్లి రహనేతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. రహనే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహనే 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెలూక్వాయో వేసిన బంతికి మూడో వికెట్గా వెనుదిరిగాడు. తర్వాత అల్రౌండర్ హార్దిక్పాండ్యా కోహ్లితో కలిశాడు. సారథి విరాట్ తన అద్బుతమైన ఆటతీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. 45 ఓవర్లో ఫెలూక్వాయో వేసిన మూడో బంతికి రబడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 112 పరుగులు చేసిన కోహ్లి తన కెరీర్లో 33వ సెంచరీని సాధించాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను డీకాక్, హషీమ్ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆమ్లా16 పరుగులు చేసి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. బూమ్రా బౌలింగ్లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్ను డీకాక్-డు ప్లెసిస్లు కొనసాగించారు. జట్టు స్కోరు 83 వద్ద 34 పరుగులు డీకాక్ రెండో వికెట్గా అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మర్క్రామ్, డుమినీ, మిల్లర్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరారు. ఇదే సమయంలో క్రిస్ మోరిస్-డు ప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ 74 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా జట్టు సఫారీలు రెండొందల మార్కును చేరింది. మోరీస్ 37 పరుగులు చేసి అవుటవ్వగా టెయిలెండర్ ఫెలూక్వాయో27 పరుగులు చేశాడు. కాగా.. సఫారీల ఇన్నింగ్స్ను కెప్టెన్ డుప్లెసిస్ ఒంటిచేత్తో నడిపించాడు. 112 బంతుల్లో 120 పరుగుల చేసిన డూప్లెసిస్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 269 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు తెరపడింది.
భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్లకు తలో వికెట్ దక్కింది. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో బౌలర్లలో ఫెలూక్వాయో రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్ ఒక వికెట్ దక్కాయి. ధోని విన్నింగ్ షాట్ తో భారత్ విజయాన్ని సాధించింది. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది.దీంతో 5 వన్డేల సిరీస్లో విరాట్ ఆర్మీ 1-0తో ముందజ వేసింది.

ఢిల్లీ : టెస్ట్ టాప్ ర్యాంకర్ టీమిండియా...దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్కు సన్నద్ధమైంది. వాండరర్స్ ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్పై భారత బ్యాటింగ్కు దక్షిణాఫ్రికా బౌలింగ్కు మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. తొలి రెండు టెస్ట్ల్లో తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్ టెస్ట్తోనే సిరీస్ దక్కించుకున్న సఫారీ టీమ్ కొహ్లీ సేనపై క్లీన్ స్వీప్ సాధించాలని తహతహలాడుతోంది.
మూడో టెస్ట్కు వాండరర్స్లో రంగం సిద్ధం
భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్ట్కు వాండరర్స్లో రంగం సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న సౌతాఫ్రికా...ఆఖరి టెస్ట్లోనూ భారత్కు అసలే మాత్రం అవకాశమిచ్చేలా లేదు. తొలి రెండు టెస్ట్ల్లో తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్ టెస్ట్తోనే సిరీస్ దక్కించుకున్న సఫారీ టీమ్ కొహ్లీ సేనపై క్లీన్ స్వీప్ సాధించాలని తహతహలాడుతోంది.
బ్యాటింగ్లో భారత్ దారుణంగా విఫలం
టెస్టు టాప్ ర్యాంకర్ టీమిండియా రెండు టెస్ట్ల్లోనూ బౌలింగ్లో అంచనాలకు మించి రాణించినా....బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. విరాట్,పుజారా,విజయ్,ధావన్ ,రోహిత్ శర్మ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నా స్వల్ప లక్ష్యాలను కూడా చేధించలేక చేతులెత్తేసింది.సఫారీ పేస్ బౌలర్లను చెక్ పెట్టడంలో భారత బ్యాట్స్మెన్ విఫలమవుతూనే ఉన్నారు.
సౌతాఫ్రికా రెట్టించిన ఉత్సాహం
మరోవైపు సౌతాఫ్రికా జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. భారత్పై క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యంగా దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగనుంది.బ్యాటింగ్లో అంతంతమాత్రంగానే రాణిస్తోన్నా....వెర్నోర్ ఫిలాండర్, మోర్నీ మోర్కెల్, కగిసో రబడ, లుంగి నంగ్డీ వంటి టాప్ క్లాస్ పేస్ బౌలర్లు సమిష్టిగా చెలరేగుతుండటంతో సఫారీ టీమ్కు తిరుగేలేకుండా పోయింది.ఆఖరి టెస్ట్లోనూ పేస్ బౌలింగ్తోనే భారత్ను బోల్తా కొట్టించాలని సఫారీ టీమ్ ప్లాన్లో ఉంది.
టెస్ట్ రికార్డ్లో భారత్పై సౌతాఫ్రికా పై చేయి
టెస్ట్ ఫేస్ టు ఫేస్ రికార్డ్లోనూ భారత్పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 35 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది.భారత్ 10 మ్యాచ్ల్లో మాత్రమే నెగ్గింది. వాండరర్స్ ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్పై దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కోవడం భారత బ్యాట్స్మెన్కు పెద్ద సవాలే అనడంలో అనుమానమే లేదు.

ఢిల్లీ : టెస్ట్ టాప్ ర్యాంకర్ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో విఫలమైంది.3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్మెన్ తేలిపోవడంతో రెండో టెస్ట్లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించాడు. 4వ ఇన్నింగ్స్లో 287 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత బ్యాట్స్మెన్ మరోసారి చేతులెత్తేశారు. 3 వికెట్లకు 35 పరుగులతో ఆఖరి రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.
అంతర్జాతీయ కెరీర్లో ఆడిన తొలి టెస్ట్లోనే లుంగీ నంగ్డీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్కు చెక్ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు తీసి భారత్ బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించాడు.రాహుల్,విరాట్ కొహ్లీ,హార్దిక్ పాండ్య,అశ్విన్,షమీ,బుమ్రా వికెట్లు తీసి భారత్ను 151 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.
135 పరుగుల తేడాతో నెగ్గిన సౌతాఫ్రికా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది.2 ఇన్నింగ్స్ల్లో కలిపి 7 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించిన లుంగీ నంగ్డీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. రెండు టెస్టుల్లోనూ బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్మెన్ తేలిపోవడంతో టీమిండియాకు సిరీస్ ఓటమి తప్పలేదు.

దక్షిణాఫ్రికా : టీమ్ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సఫారీ గడ్డపై భారత్కు తొలి పరాభావం ఎదురైంది. కేప్టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విరాట్సేన చతికిలపడింది.72 పరుగుల తేడాతో ఓడి... మూడుటెస్ట్ల సిరీస్లో సౌతాఫ్రికాకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది.
మొదటి టెస్ట్లో టీమ్ ఇండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్లో జరిగిన మొదటి టెస్ట్లో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఒకరోజు ఆట మిగిలి ఉండగానే చేతులెత్తేసింది. 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సఫారీ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్లు డ్రెస్సింగ్రూమ్ బాట పట్టారు. రెండో ఇన్సింగ్స్లోనూ భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా... బ్యాట్స్మెన్ మాత్రం పరుగులు సాధించడంలో చేతులెత్తేశారు.
భారత్కు 208 పరుగుల లక్ష్యం
మొదటి టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి ఇన్సింగ్స్లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమ్ ఇండియా తొలి ఇన్సింగ్స్లో భారత టాప్ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో సఫారీలు 77 పరుగుల ఆధిక్యం సాధించారు. రెండో ఇన్సింగ్స్లో దక్షిణాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్కు 208 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
భారత ఆటగాళ్లు ఘోర విఫలం
సఫారీలు తమ ముందుంచిన 208 పరుగుల టార్గెట్ను చేరుకోవడంలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఓపెనర్లు ధవన్ 16 పరుగులు, విజయ్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేఆరు. ఇక చతేశ్వర్ పుజారా 4 పరుగులు మాత్రమే చేసి మోర్కెల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చుతాడనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 28 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ 10 రన్స్, హార్థిక్ ఒక రన్ చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఆశ్విన్, భువనేశ్వర్తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 53 బాల్స్ ఆడిన అశ్విన్ ఐదు బౌండరీలు బాది 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన షమీ, బుమ్రా వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో రెండో ఇన్సింగ్స్లో భారత జట్టు 135 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 72 రన్స్ తేడాతో ఈ టెస్ట్మ్యాచ్ను కోల్పోయింది. దీంతో మూడు టెస్ట్ల సిరీస్లో సౌతాఫ్రికా 1-0 తేడాతో లీడ్లోకి వెళ్లింది. ఫిలాందర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కేప్ టౌన్ : మ్యాచ్ ఆరంభమైన 30 నిమిషాల్లోనే ముగ్గురు టాప్ ఆర్డర్ ఆటగాళ్లను పెవిలియన్కు పంపి భువనేశ్వర్ కుమార్ భారత్కు శుభారంభం అందించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 4.5 ఓవర్లకు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ భారత పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. అప్పటి వరకు చెమటలు పట్టించిన భువీ బౌలింగ్లో 9వ ఓవర్లో 4 ఫోర్లు బాది 17 పరుగులు సాధించాడు. వైవిధ్య బంతులను ఎదుర్కొంటూ ఏబీడీ, డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. సఫారీ సారథి డుప్లెసిస్ సహకారంతో దూకుడుగా ఆడిన డివిలియర్స్ కెరీర్లో 41వ అర్ధశతకం సాధించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ కొనసాగించిన ఈ జోడీని 114 పరుగుల వద్ద బుమ్రా విడదీశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువ బౌలర్ బుమ్రా బౌలింగ్లో విధ్వంసకర బ్యాట్స్మన్ డివిలియర్స్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి వరకు ఎవరికీ చిక్కకుండా ఆడిన ఏబీడీని ఔట్ చేసి బుమ్రా ప్రశంసలందుకున్నాడు.
నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్
క్రీజులో అడుగుపెట్టింది మొదలు నిలకడగా ఆడుతూ వచ్చిన డుప్లెసిస్ ఈ క్రమంలో కెరీర్లో 16వ అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం కొద్దిసేపటికే యువ ఆల్రౌండర్ పాండ్య వేసిన బంతికి జట్టు స్కోరు 142 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డికాక్ 40 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. ఫిలాండర్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. వీరిద్దరూ చాలా వేగంగా 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా కేశవ్ మహరాజ్(35), కగిసో రబాడ(26) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీలైనన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచాలనే ఉద్దేశంతో సింగిల్స్ తీస్తూనే బౌండరీలు బాదారు. ఇన్నింగ్స్ ఆఖర్లో రబాడ, మోర్కెల్ను అశ్విన్ ఔట్ చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు, అశ్విన్ రెండు, షమీ, బుమ్రా, పాండ్య తలో వికెట్ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు కట్టడి చేసి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు.. సఫారీ బౌలర్లు షాకిచ్చారు. టాప్ ఆర్డర్ ముగ్గురు ఆటగాళ్లు చెత్త షాట్లు ఆడి పెవిలియన్కు వరుస కట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. భారత్ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా(5), రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నారు.

డర్బన్ : ట్రెడిషనల్ ఫార్మాట్లో అసలు సిసలు టెస్ట్ సిరీస్కు రంగం సిద్ధమైంది.సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు కొహ్లీ అండ్ కో పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.టెస్టుల్లో టాప్ ర్యాంక్లో ఉన్న టీమిండియా 2వ ర్యాంకర్ సౌతాఫ్రికాపై సఫారీ గడ్డపై తొలి సారిగా సిరీస్ విజయం సాధించాలని తహతహలాడుతోంది. 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి టెస్ట్కు కేప్టౌన్లో రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోతోన్న భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది.విరాట్,రాహుల్, పుజారా,విజయ్,రహానే,రోహిత్ శర్మ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్తో పాటు భువనేశ్వర్ కుమార్,బుమ్రా,ఇషాంత్ శర్మ,ఉమేష్ యాదవ్, అశ్విన్,జడేజా వంటి బౌలర్లతో బౌలింగ్ ఎటాక్ పదునుగా ఉంది.
అన్ని విభాగాల్లోనూ ధీటుగా
మరోవైపు సౌతాఫ్రికా జట్టు భారత్కు అన్ని విభాగాల్లోనూ ధీటుగా ఉంది. ఆమ్లా, డివిలియర్స్,డు ప్లెసి,క్వింటన్ డి కాక్,డీన్ ఎల్గార్ వంటి బ్యాట్స్మెన్తో పాటు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్,ఫిలాండర్,రబడ వంటి మేటి ఫాస్ట్ బౌలర్లతో పటిష్టంగా ఉంది. టెస్ట్ ఫేస్ టు ఫేస్ రికార్డ్లోనూ భారత్పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 33 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది.భారత్ 10 మ్యాచ్ల్లో నెగ్గింది.సౌతాఫ్రికాలో ఇప్పటివరకూ 17 టెస్టులు ఆడిన భారత్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది.ప్రస్తుతం వరుస టెస్ట్ సిరీస్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా...ఈ సారైనా సౌతాఫ్రికా జట్టుపై సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించాలని పట్టుదలతో ఉంది.మరి సొంతగడ్డపై ఎదురులేని సౌతాఫ్రికా జట్టు ఆధిపత్యానికి భారత జట్టు చెక్ పెట్టగలుగుతుందో లేదో చూడాలి.

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేదార్జాదవ్, బౌలర్ శార్దూల్ ఠాకూర్కు జట్టులో చోటు దక్కింది. అశ్విన్ , జడేజాకు మరోసారి నిరాశ ఎదురైంది. 2018లో సౌతాఫ్రికాలో జరిగే సిరీస్ కోసం వెళ్లే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన ఆల్ ఇండియా సీనియర్ సెలెక్టర్ కమిటీ దక్షిణాఫ్రికాతో తలపడే భారతజట్టు సభ్యులను నిర్ణయించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టు వివరాలు ప్రకటించింది.
మిడిలార్టర్ బ్యాట్స్మెన్ కేదార్జాదవ్, బౌలర్ శార్దూల్ ఠాకూరుకు తుదిజట్టులో చోటు దక్కింది. చాలా కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న స్పిన్నర్ అశ్విన్కు, ఆల్రౌండర్ జడేజాకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ సిరీస్ నుంచి విరామం తీసుకుని వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ ఈ సిరీస్తో మళ్లీ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో జరిగే ఆరు వన్డేల సిరీస్లో ఈ జట్టు తలపడనుంది.
విరాట్ కోహ్లీ సారథిగా, రోహిత్శర్మ వైఎస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. శిఖర్ ధావన్, ధోనీ, అజింక రహానె, శ్రేయస్ అయ్యర్, మనీష్పాండేకు జట్టులో చోటు దక్కింది. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యా, మహ్మద్షమికి తుదిజట్టులో స్థానం లభించింది.

లండన్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. ధావన్ 78, కోహ్లీ76, యువరాజ్సింగ్ 23 పరుగులతో రాణించి భారత్కు విజయాన్ని అందించారు. అంతకుముందు భారత బౌలింగ్ దాటికి సఫారీలు 44.3 ఓవర్లలో 191 పరుగులకు అలౌటయ్యారు. భారత్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.
Pages
Don't Miss
