భూపాలపల్లి : జిల్లాలోని గుత్తికోయలపై అటవీఅధికారులు దాష్టీకానికి పాల్పడ్డారు. గిరిజనులపై పోలీసులు కండకావరం ప్రదర్శించారు. గిరిజనులు కూడా మనుషులు అనే విషయాన్ని మర్చి అమానవీయంగా ప్రవర్తించారు. గుత్తికోయలపై అటవీ అధికారులు దాడులు చేశారు. గోవిందరావు పేట మండలం పసర రేంజ్ పరిధిలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో... దాడి చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో వారిపై...
కరీంనగర్/మంచిర్యాల/భూపాలపల్లి : గులాబీ పార్టీని ఉద్యమ సమయం నుంచి ఆదరించిన ఉత్తర తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో బొగ్గు గనుల రాజకీయ వేడి రగులుతోంది. గులాబీ పార్టీని సింగరేణి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు...
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా పాండవులగుట్టలో రాక్ క్లైబింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహించిన ఈ ఫెస్టివల్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాక్ క్లైంబింగ్ ఫెస్టల్వకు వచ్చిన వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి నడుంకు తాడుకట్టుకుని కొండలు ఎక్కారు.
జయశంకర్ భూపాలపల్లి : భారీవర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోల్బెల్ట్ ప్రాంతంలో కెటికె సెక్టార్ ప్రాజెక్ట్ ఒపెన్ కాస్ట్లో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో గనిలోకి నీరు చేరి.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు సుమారు 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...
జయశంకర్ : జిల్లాలోని గుడ్మార్నింగ్ ప్రైవేటు స్కూల్లో విద్యార్ధుల వద్ద నిషేధిత గుట్కాలు లభించడం కలకలం రేపుతోంది. ఓ విద్యార్ధి తోటి విద్యార్ధులకు గుట్కాలు ఇస్తుండగా ప్రిన్సిపాల్ మందలించారు. దాంతో భయపడిన మరో విద్యార్ధి దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతనిని 108లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
భూపాలపల్లి : వాసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ లక్ష్యంగా సింగరేణి కార్మికుల చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరింది. కార్మికులు సమ్మెతో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గ గనుల ప్రాంతంలో 144 సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహారించారు. ఈ సమ్మెలో ఒక్క సంఘం మినహా అన్ని సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె వల్ల 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం...
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అటవీప్రాంతంలో గిరిజన బాలికపై అత్యాచారం ఘటనలో 10టీవీ కథనానికి పోలీసులు స్పందించారు. భారత్దేశ్ బేస్ క్యాంప్నకు చెందిన విజయ్ కుమార్, సంతోష్లను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అడవిలో ఎర్రచీమలను పట్టుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 366,...
భూపాలపల్లి : జిల్లా తడ్వాయి మండలం ముసలమ్మపేట లో గిరిజన బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10టీవీ వరుస కథనాలతో జిల్లా యంత్రంగం స్పందించింది. భారత్ దేశ్ క్యాంప్ నకు చెందిన విజయ్, సంతోష్ లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. టెన్ టివి సామాజిక బాధ్యతతో గిరిజన అడవుల్లో జరిగిన ఘోరాన్ని టెన్ టివి బయటపెట్టింది. కథనాలతో జిల్లా కలెక్టర్...
భూపాలలపల్లి : ఉదయం నుంచి టెన్ టివిలో వరుస కథనలతో తాడ్వాయి మండలంలో సామూహిక అత్యాచారం ఘటనపై ఉన్నతధికారులు స్పందించారు. ఎస్పీ భాస్కర్ నిందితులపై కేసు నమోదుకు ఆదేశించారు. ఏటూరు నాగారం సీఐ ఆధ్వర్యంలో బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఫారెస్ట్ ఉద్యోగి సంతోష్, బీట్ ఆఫీసర్ కల్యాణి భర్త విజయ్ కుమార్ లను తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.