Home » చనిపోయి ఐదుగురి ప్రాణాలను కాపాడిన చిన్నారి
Published
7 days agoon
ఊహ కూడా పూర్తిగా తెలియని వయసు.. నిండుగా 20నెలలుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన పాప.. కన్నవారికి సోకాన్ని మిగిల్చి వెళ్తూ వెళ్తూ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఢిల్లీలోని రోహిణికి చెందిన ధనిష్తా అనే 20 నెలల చిట్టితల్లి.. చిన్నవయస్సులో ప్రాణదాతగా మారి ఈ లోకాన్ని విడిచింది.
జనవరి 8వ తేదీన ఇంటి బాల్కనీలో నుంచి కింద పడిన చిన్నారి ధనిష్తాను గంగారామ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. 11వ తేదీన బ్రెయిన్ డెడ్ అవడంతో ప్రాణాలు కోల్సోయే పరిస్థితిలోకి వచ్చింది.
ఈ సమయంలో తల్లిదండ్రులు ఆశిశ్ కుమార్, బబితా.. చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించగా.. ఆ అవయవాలతో ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్లు వెల్లడించారు.
పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషెంట్లకు అందించగా.. అవయవాల కోసం చూస్తున్న పలువురిని కలిసినప్పుడు మేం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆశిశ్ కుమార్ చెప్పారు. మా పాప చనిపోయినాబ ఆ ఐదుగురిలో బతికే ఉంటుందని భావించి అవయవాలు దానం చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు.