బరువు పెరగడానికి ఆహారం అధిక మోతాదులో తీసుకుంటే సరిపోదు.

తగిన ఆహారం సరైన పాళ్ళలో రోజూ ఒకే సమయంలో తీసుకోవాలి. 

అప్పుడే అందులోని పోషకాలు శరీరానికి చక్కగా వంటబడతాయి

బరువు పెరగడంతో పాటు శక్తీ వస్తుంది.

శక్తినిచ్చే కార్బోహైడ్రేట్ల కోసం అన్నిరకాల ధాన్యాలు, పండ్లు ఉపయోగపడతాయి.

కండరాలు బలమవడానికి పాలు, గుడ్లు, చికెన్‌, చేప, అన్నిరకాల పప్పు ధాన్యాలు తీసుకోవాలి

ప్రతిపూట ఆహారంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.

ఇలాచేస్తే కొద్దిగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించవచ్చు.

రోజూ తప్పనిసరిగా అరగంట వ్యాయామం లేదా ఏవైనా ఆటలు ఆడాలి.

ఆకలి పెరగడమేగాక బరువు పెరిగేందుకు, శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది.