ఉదయాన్నే కార్యాలయాలకు, స్కూల్స్కు వెళ్లే తొందరలో బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలామంది మానేస్తుంటారు.
తరచూ అల్పాహారం తీసుకోవటం మానేస్తే ఇబ్బందులు తప్పవని వైద్యులు పేర్కొంటున్నారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది.
రోజును శక్తివంతంగా, రిఫ్రెష్గా ప్రారంభించాలంటే శరీరానికి శక్తి అవసరం.
ఉదయం మనం తినే ఆహారమే దీనికి కారణం.
ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోతే కోపం, చిరాకు, మలబద్ధకం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఉదయం నిద్రలేచిన 2 గంటలలోపు అల్పాహారం తీసుకోవాలి.
అల్పాహారం దాటవేయడం వల్ల తలనొప్పి ,మైగ్రేన్లు కూడా వస్తాయి.
కొంతమంది బరువు తగ్గడానికి ఉదయాన్నే అల్పాహారం మానేస్తారు.
ఉదయం తినకపోవటం వల్ల బరువు తగ్గరని నిపుణులు పేర్కొంటున్నారు.
అల్పాహారం దాటవేయడం వల్ల శరీరంలోని సూక్ష్మపోషకాలపై ప్రభావం పడుతుంది.
అంతేకాక ఎసిడిటీ, ఉపవాసం, రుతుక్రమం సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఉదయాన్నే అల్పాహారం తరచూ మానేస్తుంటే హిమోగ్లోబిన్, బి 12, విటమిన్ డి లోపానికి కారణమవుతుంది.