రాజకీయాల్లో యువత ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. ఇక చట్ట సభల్లో అయితే మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత లోక్సభలో వీరు 5 శాతం కంటే కూడా తక్కువగా ఉన్నారు. అందునా ఇందులో ఎక్కువ మంది రాజకీయ వారసులే ఉన్నారు. ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు వంటి వారసులే ఎక్కువగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. ఇకపోతే రాజకీయాల్లోకి వచ్చే యువతలో మహిళల ఆచూకే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, 2019లో లోక్సభలో అడుగుపెట్టిన యువకుల గురించి తెలుసుకుందాం..