వేగంగా బరువు తగ్గాలా? అయితే రోజూ తినండీ పియర్స్ పండ్లు అంటున్నారు నిపుణులు..
ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండు తింటే ఆకలిగా అనిపించదు..
నీటిశాతం ఎక్కువుండటంతో జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గడంలో మెండుగా పనిచేస్తాయి..
ఈ పండులో ఉండే గుణాలు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి.
విటమిన్ సి, కె ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి.
మధుమేహం, గుండెజబ్బులనూ దరి చేరనివ్వవు. ఐరన్, కాపర్ గుణాలెక్కువగా ఉండే ఈ పండ్లు తింటే రక్తహీనతను అరికడుతుంది.
నీరసంగా ఉన్నా, అలసటగా ఉన్నా రోజూ ఒక పియర్ పండు తింటే చక్కటి శక్తిని..ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, ఎలు గాయాలను త్వరగా మాన్పుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పండ్లలోని ఫ్లావనాయిడ్లు, సినమిక్ ఆసిడ్లు క్యాన్సర్ని దరి చేరనివ్వవు.
ఈ పండ్లలోని యాంథోసియానిన్ టైప్2 మధుమేహాన్ని అడ్డుకుంటుంది..