AP Politics: నెల్లూరు నాటు దెబ్బకి వైసిపి దిమ్మతిరిగిపోయింది.. నారా లోకేష్
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.
Nara Lokesh: యువగళం దెబ్బకి జగన్ పర్మినెంటుగా ఇడుపులపాయ ప్యాలస్కి వెళ్లడం ఖాయమని, నెల్లూరు నాటు దెబ్బకి వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయిందని తెలుగుదేశం నేత నారా లోకేష్ అన్నారు. గురువారం జిల్లాలోని కోవూరులో నిర్వహించిన యువగళం యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీడీపీ హయాంలోనే కోవూరు అభివృద్ధి చెందిందని, ఎంతో ఘన చరిత్ర ఉన్న కోవూరు నేలపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టమని ఆయన అన్నారు.
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు. ఈ అవినీతి గురించి తెలుసుకున్న తరువాత ప్రసన్నకుమార్ రెడ్డికి నల్లతాచు అని పేరు పెట్టాటనని అన్నారు. డెయిలీ కలెక్షన్స్, వీక్లీ కలెక్షన్స్, మంత్లీ కలెక్షన్స్లలో ఆ నల్లతాచు ఫేమసని లోకేష్ అన్నారు.
‘‘2014లో మూడు సీట్లు ఇస్తే టీడీపీ చేసిన అభివృద్ధిని, 2019లో 10కి 10 సీట్లు ఇస్తే వైసీపీ చేసిన అభివృద్ధిని నెల్లూరు ప్రజలు బేరీజు వేసుకోవాలి. 2019లో వైసీపీకి ఇచ్చిన 10 సీట్లు మాకు ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టు కుంటా. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను’’ అని లోకేష్ అన్నారు.