Urvashi Rautela : భారత్-పాక్ మ్యాచ్లో గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. సాయం చేయమని పోస్ట్
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందట. అయితే అక్కడ తన గోల్డ్ ఐ ఫోన్ పోయిందట.
Urvashi Rautela lost gold iPhone : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ చూసేందుకు సాధారణ ఫ్యాన్స్తో పాటు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు స్టేడియానికి వెళ్లారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా మ్యాచ్ చూసేందుకు మైదానానికి వెళ్లింది. మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేసినప్పటికీ ఆ తరువాత ముద్దు గుమ్మకు పెద్ద కష్టం వచ్చింది.
ఆమె ఐఫోన్ స్టేడియంలో పోయిందట. ఈ విషయాన్ని సదరు నటి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అది 24 క్యారెట్ల బంగారంతో చేసిన గోల్డ్ ఐ ఫోన్ అని పేర్కొంది. ఆ ఫోన్ ఎవరికైనా దొరికితే తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. ఫోన్ ఆచూకీని కనిపెట్టేందుకు తనకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేసింది.
ప్రభాస్ అన్న కోసం తప్పుకున్నా..
‘అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐ ఫోన్ పోయింది. ఫోన్ ను కనుగొనడంలో నాకు సాయం చేయండి. ఎవరికైనా దొరికితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు తెలియజేయండి. నేను తీసుకుంటాను.’ అని ఊర్వశీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ చేసిన కాపీని సైతం అటాచ్ చేసింది.
? Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! ?️ If anyone comes across it, please help. Contact me ASAP! ? #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba— URVASHI RAUTELA?? (@UrvashiRautela) October 15, 2023
స్టేడియం వీడియోను షేర్ చేసిన ఊర్వశి..
అంతకుముందు ఊర్వశి రౌటేలా తాను స్టేడియంలో ఉన్నప్పడు వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో భారత్ విజయం దిశగా పయనించడం చూస్తూ ఆమె చాలా సంతోషంగా కనిపిస్తోంది. టీమ్ ఇండియాకు మద్దతుగా బ్లూ డ్రెస్ వేసుకుని ఆమె స్టేడియానికి వెళ్లింది. నటి లుక్ని ఆమె అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు.
View this post on Instagram
Renu Desai : రేణు దేశాయ్ ‘మయోకార్డియల్ బ్రిడ్జింగ్’ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?
సినిమాల విషయానికి వస్తే.. సన్నీ డియోల్తో కలిసి ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఊర్వశి రౌతేలా. ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఐటం సాంగ్స్ ద్వారానే ఆమె బాగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’, స్కందలో ‘కల్ట్ మామా’ వంటి పాటలతో యువత హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆమె ‘దిల్ హై గ్రే’ అనే బాలీవుడ్ సినిమా చేస్తోంది.