ఏపీ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు, 45 రోజులు వేధించారు- ముంబై నటి సంచలన వ్యాఖ్యలు

ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు.

ఏపీ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు, 45 రోజులు వేధించారు- ముంబై నటి సంచలన వ్యాఖ్యలు

Mumbai Actress Case : ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేశారని, 45 రోజుల పాటు వేధించారని ముంబై సినీ నటి జత్వాని ఆరోపించారు. వేధింపుల కేసులో విజయవాడ సీపీ కార్యాలయంలో పోలీసులు నటి జత్వాని స్టేట్ మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. తనను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని చెప్పారు. విజయవాడ‌ సీపీగా ఉన్న కాంతి రానా టాటా ఆధ్వర్యంలో తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. 10 నుండి 15 మంది పోలీసు ఆఫీసర్లు తనను కిడ్నాప్ చేశారని, 45 రోజులు వేధించారని జత్వాని తెలిపారు.

”నన్ను అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను. ఆ డాక్యుమెంట్ లో ఉన్న అడ్రస్, టైమ్ అన్నీ తప్పులు ఉన్నాయి. ముంబై కేస్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కుక్కల విద్యాసాగర్ నాతో పెళ్లికి‌ ప్రపోజ్‌ చేశాడు. నేను 2015 లోనే అతని ప్రవర్తన మూలంగా నిరాకరించాను” అని జత్వాని తెలిపారు.

నర్రా శ్రీనివాస్, ముంబై సినీ నటి జత్వాని తరపు న్యాయవాది
”పోలీసులు జత్వానీ నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఎర్ ఆంజనేయులు, కాంతి రానా, విశాల్ గున్నీతో పాటు మరో ఇద్దరు పోలీసులు అధికారులు తనను ఇబ్బందులకు గురి చేశారని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చారు. నటి జత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు. 41 ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారు. సీనియర్ సిటిజన్లుగా ఉన్న నటి తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో పోలీసుల విచారణలో తేలుతుంది. నటిపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందే.”

 

Also Read : భవిష్యత్తులో వైసీపీ కోలుకోకుండా దెబ్బకొట్టేలా చంద్రబాబు వ్యూహం..!