Telangana : తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రెండ్రోజులు పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rain Alert in telangana : మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయగుండంగా మారింది. దీంతో ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది.. రేపు తెల్లవారు జామున కళింగపట్నం, విశాఖపట్టణం, గోపాల్ పూర్ ప్రాంతాల్లో తీరందాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. : సీఎం చంద్రబాబు
తెలంగాణ భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే జిల్లాలో నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీరే అవకాశం ఉంది. గడిచిన కొద్ది గంటల్లో అత్యధికంగా నారాయణ పేటలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read : Heavy Rains : విజయవాడలో కుండపోత వర్షం.. బయటకు రావొద్దంటూ ప్రజలకు పోలీసుల హెచ్చరికలు
తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాటిలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు బారీ వర్షాల నేపథ్యం లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.