నందమూరి ఫ్యామిలీ వార్.. ‘దేవర’ సినిమాపై ఎఫెక్ట్ చూపబోతుందా?
ఫ్యామిలీ మొత్తం బాలకృష్ణ ఇంటి నుంచి ఒకే బస్లో వేడుకకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు..
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవర సినిమాకు పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవా? నందమూరి ఫ్యామిలీ వార్ సినిమాపై ఎఫెక్ట్ చూపబోతుందా? బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారనే వార్తల నేపథ్యంలో సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న దేవరపై ఎలాంటి ప్రభావం పడనుంది…?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్నా… ఇప్పటివరకు సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు నిర్మాతలు. దీనిపైనే అభిమానులు టెన్షన్ పడుతుండగా, తాజాగా నందమూరి ఫ్యామిలీ వార్తో జూనియర్ను అంతా దూరం పెట్టడం అభిమానులను మరింత షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా, సినీ పరిశ్రమ పెద్దలు చంద్రబాబుతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు.
అలాంటి సహకారం అందుతుందా?
సినిమా నిర్మాణంలో బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవరకు అలాంటి సహకారం అందుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు వేసుకునే వెసులుబాటు రావాలంటే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండాల్సిందేనంటున్నారు. గత కొంతకాలంగా సీఎం చంద్రబాబుతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్న జూనియర్కు ఈ వెసులుబాటు ఉంటుందా? లేదా? అనేదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవాలు ఆదివారం హైదరాబాద్ నోవాటెల్లో గ్రాండ్గా చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం రకరకాల కారణాలతో పిలవలేదని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఫ్యామిలీ మొత్తం బాలకృష్ణ ఇంటి నుంచి ఒకే బస్లో వేడుకకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇలాంటి ముఖ్యమైన ఈవెంట్ను జూనియర్ మిస్సవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతుత్సవాలకు కూడా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఇప్పుడు అలాంటి మరో ఇంపార్టెంట్ కార్యక్రమానికి దూరమైపోవడమే టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ ప్రభావం దేవరపై తప్పకుండా ఉంటుందని అంటున్నారు సినీ పండితులు.
Also Read: బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. టాలీవుడ్లోని ఇద్దరు బ్రదర్స్కు నో ఇన్విటేషన్?