Vegetable Crops : కూరగాయ పంటల్లో నీటి యాజమాన్యం
నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది.

Vegetable Crops : మొక్కలకు నీరు ప్రాణాధారమైనది. ముఖ్యంగా రైతులు సాగుచేసే పంటలకు అవసరానికి తగ్గట్టు నీటిని అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుండటంతోపాటు మంచి దిగుబడి, నాణ్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కూరగాల సాగుచేస్తున్న రైతులు సకాలంలో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంటల వారిగా వాటికి సరైన సమయంలో నీటిని అందించటం చాలా ముఖ్యం. కొన్ని రకాల కూరజాతి పంటల్లో నీటి యాజమాన్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మిరప ; ఈ పంట అధిక తేమను, బెట్టను తట్టుకోలేదు. తేమ పెరిగితే పూత రాలుతుంది. తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. బెట్టకు గురైనప్పుడు పూత రాలడంతోపాటు కొత్త రెమ్మలు ఏర్పడవు. నల్ల రేగడి నేలల్లో 3వారాలకు ఒకసారి , తేలిక నేలల్లో 15 రోజులకు ఒక సారి , వేసవి
పంటలో 6 రోజులకు ఒకసారి నీరు అందించాలి.
వంగ ; నారు నాటే ముందు లేదా నాటిన తరువాత నీటిని ఇవ్వాలి. నేలలో తేమను బట్టి వారానికి ఒక సారి వేసవిలో 4 రోజులకొకసారి తడి ఇవ్వాలి. పూత,కాత దశలో నేలలో తేమ ఉండాలి. లేదంటే పూత రాలుతుంది. వేసవిలో కాయ కోతకు ఒక రోజు ముందు నీటి తడి ఇవ్వాలి. లేదంటే కాయలో చేదు పెరుగుతుంది.
టమోటా; టమోటా సాగు చేసే రైతులు వేసవిలో పంటను కాపాడుకునేందుకు సకాలంలో నీటి తడులు ఇవ్వటం అవసరం. వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వటం వల్ల పంటను కాపాడుకోవచ్చు. మంచి దిగుబడి వస్తుంది.
ఉల్లి ; ఉల్లికి తరుచుగా నీరు అందిస్తుండాలి. నారు దశలో వారం వ్యవధిలో రెండు సార్లు నీరు ఇవ్వాలి. తరువాత 60 రోజుల వరకు 12 రోజులకు ఒకసారి నీరు అందించాలి. గడ్డ ఊరే సమయంలో 7 రోజుల వ్యవధిలో 7 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందు నీరు ఇవ్వటం ఆపాలి. ఖరీఫ్ లో 8, రబీలో 12, వేసవిలో 15 సార్లు నీటితడులివ్వాలి. గడ్డ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ ; నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది. ఈ రెండు పంటలకు నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.
చిక్కుడు ; పందిరి రకాలకు పాదులో మట్టి 3 సెంటీమీటర్ల లోతులో ఎండినప్పుడు నీరు ఇవ్వాలి. పాదుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. చిక్కుడ, గోరుచిక్కుడు కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఫ్రెంచి చిక్కుడు అధిక తేమను, నీటి ఎద్దడిని తట్టుకోలేవు. 7 నుండి 10 రోజుల కొకసారి నేల స్వభావాన్ని బట్టి నీరు అందించాలి.
క్యారెట్ ; నేల స్వభావం, వాతావరణం పరిస్ధితులను బట్టి 7 రోజుల కు ఒకసారి నీరు అందించాలి. దుంప పెరుగుదల దశలో తగినంత తేమ ఉండాలి. ఆకులు వాడినట్లు కనపడక ముందే నీరు అందించాలి. అవసరానికి మించి నీరు ఇవ్వారాదు. దీనివల్ల వేరు పెరుగుదల తగ్గుతుంది. తేమ ఎక్కవగా ఉంటే క్యారెట్ నాణ్యతపై ప్రభావం పడుతుంది.
1Mukesh Ambani : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్గా ఆకాశ్ అంబానీ
2Telangana: 30న పదో తరగతి ఫలితాలు
3TRS Check For BJP : బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హార్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్
4State Bank Of India : ఎస్బీఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్
5Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
6Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
7Indian Company: ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోంకు ఇచ్చిన ఇండియన్ కంపెనీ
8Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
9Andhra Pradesh: కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: నక్కా ఆనందబాబు
10Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్ఖైదా కుట్ర