ఏపీలో ఒక్కరోజే 10 కరోనా మరణాలు, 10వేలు దాటిన కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన

ఏపీలో ఒక్కరోజే 10 కరోనా మరణాలు, 10వేలు దాటిన కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 10 మంది చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన కేసులు 448. మరో 49 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారివి. రాష్ట్ర కేసుల విషయానికి వస్తే.. తాజా కేసులతో కలిపి ఏపీతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8వేల 306కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4465. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3712. కరోనా మరణాల సంఖ్య 129కి పెరిగింది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారి కేసులు కలిపితే ఏపీలో కరోనా కేసుల సంఖ్య 10వేల 331కి పెరిగింది.

* ఏపీలో మరో 497 కరోనా కేసులు
* మరో 10మంది కరోనాతో మృతి
* 129కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య
* కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి
* రాష్ట్రంలో 10వేల 331కి చేరిన కరోనా కేసుల సంఖ్య
* 497 కేసుల్లో స్థానికంగా ఉంటున్న 448 మందికి కరోనా
* ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 37మందికి, విదేశాల నుంచి వచ్చిన 12మందికి కరోనా
* యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 423
* గడిచిన 24 గంటల వ్యవధిలో 36వేల 47మందికి కరోనా పరీక్షలు

Read: పారిశ్రామికవేత్త పీవీపీ పై కేసు : దౌర్జన్యం చేశారని ఆరోపణ