ఇంటింటికీ వంద శాతం నల్లా కనెక్షన్లు.. రోజూ మంచినీటి సరఫరా

  • Published By: sreehari ,Published On : November 4, 2020 / 07:32 AM IST
ఇంటింటికీ వంద శాతం నల్లా కనెక్షన్లు.. రోజూ మంచినీటి సరఫరా

Daily Drinking Water Supply to Villages  : గ్రామాల్లో ఇంటింటికి ప్రతిరోజు మంచినీటి సరఫరా కానుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో కూడా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 17,494 గ్రామాల్లో కేవలం 389 గ్రామాల్లోనే వంద శాతం ఇళ్లకు నీటి కొళాయిలు ఉన్నాయి.



వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు నీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ ప్రాంతం మొత్తంలో 95.66 లక్షల ఇళ్లు ఉన్నాయి.

అందులో 32.34 లక్షల ఇళ్లకు ఇప్పటికే కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. అందులో 63,32,972 ఇళ్లకు కొత్తగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఆర్థిక ఏడాదిలో 32,01,417 ఇళ్లకు నీటి కొళాయిలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. గత ఏడు నెలలుగా 2.85 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఏర్పాటు చేశారు.



మరో ఐదు నెలల్లో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో మంచినీటి పథకాలు, సరఫరాకు తగిన నీటి వనరులు ఉన్న గ్రామాలను ఎంచుకోనున్నారు.
https://10tv.in/odisha-boy-scores-record-100-in-neet-after-lockdown-grind-in-kota/
ఈ గ్రామాల్లో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. తొలిదశలో భాగంగా గ్రామంలో ప్రతి వ్యక్తికీ ప్రతిరోజూ 40–55 లీటర్ల మధ్య నీటి సరఫరా అందించనున్నారు.



6,301 గ్రామాల్లో వంద శాతం కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం వాటాగా రూ.790.48 కోట్లు ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం నల్లా కనెక్షన్లకు రూ.4,689.98 కోట్లు వ్యయంతో పూర్తి చేయాలని నిర్ణయించింది.