ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 102 మందికి పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 102 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కొత్త పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 102 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు.

కోవిడ్ సోకిన వారిలో చిత్తూరు నుంచి ఒకరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 56 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 1,40,92,251 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

ఏపీలో ఇప్పటివరకూ 8,90,317కు కరోనా కేసులు చేరగా, 7,171 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో 871 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 8,82,275 మంది డిశ్చార్జ్ అయ్యారు.