ఏపీలో 24 గంటల్లో 115 కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ఏపీలో 24 గంటల్లో 115 కరోనా కేసులు

new corona cases in AP : దేశంలో మళ్లీ కరోనా విజృంభింస్తోంది. దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కేసులు, ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ఇవాళ కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా బారినపడిన వారిలో 93 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,90,556 మంది కరోనా బారినపడ్డారు. 8,82,462 మంది కోలుకోగా.. మరో 921 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా బారిన పడి 7,173 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 46,566 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,41,90,477 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.