Kadapa IIIT : కడప ట్రిపుల్ ఐటీలో 12 మంది విద్యార్థులు సస్పెండ్‌

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Kadapa IIIT : కడప ట్రిపుల్ ఐటీలో 12 మంది విద్యార్థులు సస్పెండ్‌

12 Students Suspended From Kadapa Iiit

12 students suspended from Kadapa IIIT : కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం సీనియర్‌, జూనియర్‌ విద్యార్ధులు ఘర్షణపడ్డారు.

ఈ ఘటనపై స్ట్రీమ్‌ లైన్‌ కమిటి విచారణలో విద్యార్ధులు తప్పుచేసినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. తదుపరి జరగబోయే విచారణ కమిటి ముందు హాజరై ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశాన్ని కల్పించినట్లు డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు.