APPSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో ఆ పోస్టులకు నోటిఫికేషన్లు.. 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల

ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల (ఆగస్టు)లో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2018 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను గౌతమ్ సవాంగ్ విజయవాడలో మంగళవారం వెల్లడించారు.

APPSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో ఆ పోస్టులకు నోటిఫికేషన్లు.. 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల

Gwotham Sawang

APPSC Notification: ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల (ఆగస్టు)లో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను గౌతమ్ సవాంగ్ విజయవాడలో మంగళవారం వెల్లడించారు. 2018 సంవత్సరంలో 167 గ్రూప్-1 పోస్టుల (30పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు) భర్తీకి ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టింది. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు.

APPSC Chairman : ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్-1లో నిలిచారు. వైఎస్సార్ జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన కె. శ్రీనివాసరాజు టాప్-2లో నిలవగా, హైదరాబాద్ కు చెందిన సంజన సింహ టాప్ -3లో నిలిచారు. మొదటి పది స్థానాల్లో ఏడుగురు మహిళలు ఉండటం గమనార్హం.

India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..

ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను ఏపీపీఎస్సీ కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. 2018 గ్రూప్-1 పరీక్షలకు మొత్తం లక్షా నలభై వేల మంది హాజరయ్యారని, స్క్రీనింగ్‌ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారని సవాంగ్ తెలిపారు. 167 గ్రూప్-1 పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారని అన్నారు. అయితే వచ్చే నెలలో 110 గ్రూప్-1 పోస్టులకు, 182 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు. ఈ నెల 24న దేవాదాయశాఖలో ఈవో పోస్టులకు, రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందని, రాబోయే కాలంలో మరో 13నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.