Corona Virus : ఇంట్లో భజనతో ఒకే కుటుంబంలో 21మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో కలకలం

తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం

Corona Virus : ఇంట్లో భజనతో ఒకే కుటుంబంలో 21మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో కలకలం

Corona Virus : తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్రమత్తమైన అధికారులు వీరిని కలిసిన వారికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. గ్రామంలో శానిటైజేషన్ చేపట్టారు.

ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటు పాజిటివ్‌ రేటు క్రమంగా పెరుగుతోంది. నాలుగు నెలల తర్వాత గరిష్ఠంగా 758 కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
గతేడాది(2020) నవంబర్ 25న 831మందికి పాజిటివ్‌ రాగా.. ఆ తర్వాత గత 24గంటల్లో నమోదైన కేసులే అత్యధికం. బుధవారం(మార్చి 24,2021) నాటి సంఖ్యతో పోల్చితే ఒక్కసారిగా 173 కేసులు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం(మార్చి 25,2021) ఉదయం 9గంటల వరకు 35వేల 196 నమూనాలను పరీక్షించగా.. 2.15శాతం మంది వైరస్‌ బారిన పడ్డారు.

చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అత్యధికంగా ఈ జిల్లాలో 175 కేసులు రాగా.. గుంటూరులో 127మందికి పాజిటివ్‌గా తేలింది. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండంకెలకు చేరడం ఆందోళనకు గురి చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న(మార్చి 25,2021) రాత్రి 8గంటల వరకు 57వేల 548 మందికి కరోనా నిర్థరణ పరీక్షలు చేయగా, కొత్తగా 518 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు.

భారీ మూల్యం తప్పదు:
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్‌ను లైట్ తీసుకోవద్దని అంటున్నారు. అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.