Vizianagaram : యువతి జీవితంతో చెలగాటమాడిన మృగాళ్లు

ఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా చేశారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు.. బ్లాక్‌ మెయిల్‌ చేసి మరొకరు ఇలా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు.

Vizianagaram : యువతి జీవితంతో చెలగాటమాడిన మృగాళ్లు

Vizianagaram

3 Youngsters Cheated Girl : ఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా చేశారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు.. బ్లాక్‌ మెయిల్‌ చేసి మరొకరు ఇలా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అంతటితో ఆగక ఆ యువతి పెళ్లిని కూడా చెడగొట్టి పైశాచిక ఆనందం పొందారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది ఈ ఘటన. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి..మృగాళ్ల బారిన పడి నరకం చవిచూసింది.

ఆడుతూ పాడుతూ డిగ్రీ చదువు :-
ముగ్గురు యువకుల నయవంచనకు బాధితురాలుగా మిగిలిన యువతి…2014లో డిగ్రీ ఆడుతూ పాడుతూ చదివేది. అదే సమయంలో.. వెంటబడ్డాడు వల్లరిగుడబ గ్రామానికి చెందిన వాసుదేవరావు. ఆ ప్రేమ నిజమేనని నమ్మింది. 2014 నుంచి 17 వరకు వెంటబడేసరికి అతనితో చనువుగా ఉండేది. కానీ వాసుదేవరావు.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా దగ్గరైంది. యువతి అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. చివరకు పెళ్లికి నిరాకరించాడు. డిగ్రీ అయ్యాక ఓ ఫైనాన్స్ కంపెనీలో చేరి జాబ్‌ చేస్తుంటే అక్కడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. లైంగిక వాంఛ తీర్చాలంటూ తరచూ వేధించేవాడు. తన జీవితాన్ని అన్యాయం చేసిన వంచకుడి గురించి తల్లిదండ్రులకు కానీ, పోలీసులకు కానీ చెప్పలేదు. అదే ఆమె పాలిట శాపమైంది.

శారీరకంగా లొంగదీసుకున్నారు :-
వాసుదేవరావుతో సహోద్యోగికి విభేదాలు, అతను చేతిలో ఆమె మోసపోయిన విషయం గమనించిన ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి సంజీవ్‌.. ఆమె పట్ల ఇష్టం నటిస్తూనే బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత తన బుద్ధి చూపించాడు. అశ్లీల చిత్రాలు తీసి ఆమె జీవితంతో కొన్నేళ్లపాటు ఆడుకున్నాడు. వాసుదేవరావు, సంజీవ్‌ లాంటి మృగాళ్ల చేతిలో విలవిల్లాడిన బాధితురాలి భయాన్ని ఆసరాగా చేసుకున్న శివకుమార్‌ మరో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. కానీ మరోసారి ప్రేమకు మోసపోకూడదని నిశ్చయించుకున్న బాధిత యువతి శివకుమార్‌కు దూరంగా ఉండేది. అయితే అతను.. నీ నగ్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయని చెబుతూ బెదిరింపులకు దిగాడు. తాను చెప్పినట్లు వినకపోతే నీ జీవితం బజారుపాలవ్వుద్దని హెచ్చరిస్తూ శారరీకంగా లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగని శివకుమార్‌..పదే పదే ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తన పశువాంఛ తీర్చుకునేవాడు. న్యూడ్‌పిక్స్, విజువల్స్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేవాడు.

తనలో తానే కుమిలిపోయేది :-
ముగ్గురు చేతిలో మోసపోయినా తనలో తానే కుమిలిపోయేది కానీ కన్నవారికి చెప్పిన పాపాన పోలేదు యువతి. దీంతో కీచకులు ఏడేళ్లుగా రెచ్చిపోయారు. గతం మర్చిపోయి ఇల్లాలుగా కొత్త జీవితం ప్రారంభిద్దామని యువతి ఎన్నో కలలు కన్నది. తల్లిదండ్రులు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంబంధం కుదర్చడంతో రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కుతానంటూ ఆశపడింది. ఈ విషయం తెలుసుకున్న పురోహితుడైన శివకుమార్‌…జాతకాలు చూస్తానని చెప్పి పెళ్లి కొడుకు వివరాలు సేకరించాడు. పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు…ఆమె చాలా ప్రేమ కార్యకలాపాలు నడిపిందంటూ వరుడి కుటుంబసభ్యులకు చెప్పాడు.

కటకటాల్లో ముగ్గురు నిందితులు :-
అయినా వారు నమ్మకపోవడంతో.. బాధిత యువతి నగ్న ఫోటోలను పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులకు సెల్‌ఫోన్‌ నెంబర్లకు ఫార్వార్డ్‌ చేశాడు. వారంతా విషయం చెప్పి ఈ సంబంధం వద్దనేసరికి యువతి తల్లిదండ్రులు హతాశులయ్యారు. కన్నవారు నిలదీయడంతో ఇంతవరకు తనకు అన్యాయాన్ని ఏకరువు పెట్టి రోదించింది బాధితురాలు. ప్రేమ మోసగాళ్ల చిట్టా విప్పడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. ఎ1 వాసుదేవరావు, ఎ2 సంజీవ్‌, ఎ3 శివకుమార్‌ను కటకటాల్లోకి నెట్టారు.

Read More : Tirumala : తిరుమలలో రాతి శంఖు,చక్రాలు భద్రం