AP Covid – 19 : 24 గంటల్లో 4,250 కరోనా కేసులు, 33మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిపోయారు.

AP Covid – 19 : 24 గంటల్లో 4,250 కరోనా కేసులు, 33మంది మృతి

Ap Covid

Andhra Pradesh Covid : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా…12 వేల 599 మంది చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,76,977 పాజిటివ్ కేసులకు గాను 18,19,605 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
కృష్ణాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 188. చిత్తూరు 673. ఈస్ట్ గోదావరి 890. గుంటూరు 309. వైఎస్ఆర్ కడప 179. కృష్ణా 399. కర్నూలు 121. నెల్లూరు 193. ప్రకాశం 461. శ్రీకాకుళం 131. విశాఖపట్టణం 187. విజయనగరం 102. వెస్ట్ గోదావరి 417. మొత్తం : 4,250