క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయిన మహిళ  

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 03:26 PM IST
క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయిన మహిళ  

కృష్షా జిల్లా మచిలీపట్నం క్వారంటైన్ సెంటర్ నుంచి మహిళ తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం భోజనం తర్వాత మహిళ కనిపించకుండా పోయింది. 24 గంటలైనా ఇంకా ఆచూకీ ఇంకా దొరకలేదు. చుట్టు పక్కల ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో అధికారులు కేసు నమోదు చేశారు. 

మచిలీపట్నంలో ఉన్న చిలకపూడిలోని వరలక్ష్మీ పాలిటెక్నిక్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ నుంచి ఒక మహిళ నిన్న మధ్యాహ్నం పారిపోయింది. ఎందుకు వెళ్లింది. ఎలా వెళ్లిందన్న అంశానికి సంబంధించి ఇప్పటికీ వరకూ అధికారులు ఏ మాత్రం సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. 

అయితే చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇంతరు వరకు దర్యాప్తు ప్రారంభించం లేదు. ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న అంశంపై సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. మచిలీపట్నం కొద్ది రోజులుగా రెడ్ జోన్ ఏరియాలో ఉంది. ఇప్పటికే ఒక వ్యక్తి మరణించారు