ఏపీలో 24 గంటల్లో 74 కొత్త కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.

ఏపీలో 24 గంటల్లో 74 కొత్త కరోనా కేసులు

74 New Coronavirus Positive Cases : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కొత్త పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 74 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇద్దరు మరణించారు.

కోవిడ్ సోకిన వారిలో గుంటూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 61 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 1,42,62,086 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

ఏపీలో ఇప్పటివరకూ 8,90,766కు కరోనా కేసులు చేరగా, 7,176 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో 1009 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 8,82,581 మంది డిశ్చార్జ్ అయ్యారు.