Girl Gang Rape Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం..మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాలికపై సామూహిక అత్యాచారం

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కేవీబీపురం మండలం ఎమ్మిరాజుల కండ్రిగలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Girl Gang Rape Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం..మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాలికపై సామూహిక అత్యాచారం

Girl Gang Rape Tirupati (1)

Girl Gang Rape Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కేవీబీపురం మండలం ఎమ్మిరాజుల కండ్రిగలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.

గణేశ్‌ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ఊరేగింపును తిలకించేందుకు వచ్చిన బాలికకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Girl Raped : స్కూల్‌కు వెళ్తున్న బాలికపై అత్యాచారం..పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు

ఈ దాడిలో ముగ్గురు యువకులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.