తూర్పుగోదావరి జిల్లాలో విషాదం : కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం : కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

A Car Crashed Into A Canal

A car crashed into a canal : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజు కోసం స్థానికులు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

మృతుల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామం. నిన్న ఆత్రేయపురం మండలంలోని వసంతవాడలో బంధువుల ఇంటికి వచ్చారు. వసంతవాడలో తీర్థదర్శనం చేసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆత్రేయపురం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

పొగమంచుతో దారి కనిపించక ప్రమాదం బారినపడ్డారు. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో బయటపడలేకపోయారు. డోర్లు తీసి తప్పించుకుని యత్నం చేశారు కానీ.. కొంతమంది కాలువలో గల్లంతయ్యారు. మృతులను సి.హెచ్‌.శ్రీనివాసరాజు, మంతెన సురేష్‌వర్మగా గుర్తించారు. ముదునూరి గణపతిరాజు, సీతారామరాజును స్థానికులు కార్లో నుంచి బయటకు తీసి రక్షించారు.