Woman Assaulted In Muscat : మస్కట్‌లో తిరుపతికి చెందిన మహిళకు నరకయాతన.. ఇండియాకు పంపాలంటూ కన్నీరుమున్నీరు

తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్‌లో నరకయాతన అనుభవిస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని మస్కట్‌ చేరుకున్న ఆమెను..ఏజెంట్లు అమ్మేసినట్టు తెలుస్తోంది. యర్రవారిపాలెం మండలం బొడేవాండ్లపల్లికి చెందిన మహిళ 7 నెలల క్రితం రత్తమ్మ అనే ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లింది.

Woman Assaulted In Muscat : మస్కట్‌లో తిరుపతికి చెందిన మహిళకు నరకయాతన.. ఇండియాకు పంపాలంటూ కన్నీరుమున్నీరు

Woman Assaulted In Muscat

Woman Assaulted In Muscat : తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్‌లో నరకయాతన అనుభవిస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని మస్కట్‌ చేరుకున్న ఆమెను..ఏజెంట్లు అమ్మేసినట్టు తెలుస్తోంది. యర్రవారిపాలెం మండలం బొడేవాండ్లపల్లికి చెందిన మహిళ 7 నెలల క్రితం రత్తమ్మ అనే ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లింది.

అయితే ఆమెను గత కొంత కాలంగా అక్కడ ఓ కుటుంబం చిత్ర హింసలు పెడుతోంది. రూ. 20లక్షలకు నిన్ను కొనుక్కున్నామని, చెప్పినట్టు నడుచుకోవాలంటూ వేధిస్తోంది. శారీరకంగా హింసిస్తోంది. సులోచన కాలికి తీవ్ర గాయంతో ఓ ఇంట్లో బందీగా ఉంది. ఆరోగ్యం బాగోలేదని, తనను ఇండియాకు పంపాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Telangana Dalit Man: గల్ఫ్‌లో 20ఏళ్ల పాటు ఖైదుగా ఉంటూ సాయమందక తెలంగాణ దళితుడి మృతి

దీంతో ఆ మహిళ భర్తకు జరిగిన విషయాన్ని వీడియో తీసి పంపింది. తన భార్యను వెనక్కి రప్పించాలని భర్త బాలసుబ్రమణ్యం వేడుకుంటున్నారు. రూ.2 లక్షలు ఇస్తే గానీ సులోచనను ఇండియాకు తిరిగి రప్పించలేమని ఏజెంట్ రత్నమ్మ చెబుతున్నారు.