అగ్రిగోల్డ్ కేసు : డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 03:09 PM IST
అగ్రిగోల్డ్ కేసు : డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి

తెలంగాణ హైకోర్టులో సోమవారం (నవంబర్ 9, 2020) అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.



వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిటుదారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని..జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్, సీఐడీ ఎస్పీ దరఖాస్తులు ధృవీకరిస్తారని కోర్టుకు తెలిపింది. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కోర్టుకు తెలిపింది.



https://10tv.in/election-commission-ready-to-conduct-local-body-elections/
వాదనలు విన్న ధర్మాసనం మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఆ అధికారం తెలంగాణ హైకోర్టుకు సీజేకు ఉందన్న ధర్మాసనం. ఏపీ ప్రభుత్వం రెండు వారాలు గడువు కోరింది. దీనికి హైకోర్టు అంగీకరించింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.