Anantapuram : రెండేళ్లుగా ఏఎన్ఎమ్లను వేధిస్తోన్న ఉద్యోగి
అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫార్మా అసిస్టెంట్ ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్నాడు.
employee harassing ANMs : అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతియాజ్ అనే ఫార్మా అసిస్టెంట్ ప్రతి రోజు తమ వద్దకు వచ్చే ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్నాడు. తాము గ్రామ సచివాలయాల్లో పని చేస్తామని.. మందుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు ఇంతియాజ్ వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజురోజుకు ఇంతియాజ్ వేధింపులు ఎక్కువకావడంతో మహిళలు వారి బంధువులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న బంధువులు ఇంతియాజ్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అపగించారు. తమను గత రెండేళ్లుగా ఇంతియజ్ వేధిస్తున్నాడని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగినులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలపై వేధింపుల ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. మానసికంగా, శారరీకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ పలువురు మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.