Corona Death : కరోనాతో భార్య ఒడిలోనే కన్నుమూసిన భర్త

చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు.

Corona Death : కరోనాతో భార్య ఒడిలోనే కన్నుమూసిన భర్త

Corona Death

An old man died with Corona  : కరోనా మహమ్మారితో జనాలు పిట్టల్లారాలుతున్నారు. అయిన వాళ్లు కళ్లముందే కళ్లు మూస్తున్నారు. సరైన సమయానికి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది.

కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు. మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో ఆస్పత్రి బయటే రెండు గంటల పాటు ఆ వృద్ధ దంపతులు పడిగాపులు కాశారు. కనీసం ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించి చెట్టు కింది అరుగుపైనే వృద్ధుడు తుది శ్వాస విడిచారు.

దీంతో మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాధ ఘటన ఎంతో మందిని కన్నీరుపెట్టిస్తోంది. పెద్దదిబ్బ సముద్ర మండల వాసిగా గుర్తించారు.