Kapu Ramachandra Reddy : మంత్రి పదవి వస్తుందనుకున్నా..రాలేదు..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..

మంత్రి పదవి వస్తుందనుకున్నా..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..నని తెలిపారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.

Kapu Ramachandra Reddy : మంత్రి పదవి వస్తుందనుకున్నా..రాలేదు..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..

Ycp Mla Kapu Ramachandra Reddy (1)

YCP MLA Kapu Ramachandra Reddy : సీఎం జగన్ కేబినెట్ పునర్వవస్థీకరణ వైసీపీ నేతల్లో అసంతృప్తుల్ని రగలించింది. గతంలో మంత్రి పదవులు పొంది రెండవ విడదలో మంత్రి పదవులు దక్కనివారు కూడా అసంతృప్తులు వెళ్లగ్రక్కారు. కానీ మొదటిసారి మంత్రి పదవిని ఆశించి భంగపడి..రెండవసారి అయినా దక్కుతుందని ఎదురు చూసి..రెండవసారి కూడా మంత్రి పదవి దక్కకపోయినా ఏమాత్రం కోపం తెచ్చుకోని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఆయనే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.

రాయదుర్గం రావాలంటే మంత్రిగానే రా లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నియోజకవర్గానికి రావాలని ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని ఆయన అనుచరులు డిమాండ్ చేసినా జగన్ మీద ఉన్న అభిమానంతో తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన వెంటనే నడుస్తానంటున్నారు కాపు రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచానని..అప్పటి నుండి జగన్ పై ప్రేమతో ఆయన వెంట నడుస్తున్నానని ఈరోజు తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డానని అయినా తనకు ఆశించిన ఫలితం దక్కలేదని వాపోయారు. మంత్రి పదవి ఇవ్వనంతమాత్రాన జగన్ మీద నాకున్న అభిమానం తగ్గిపోదని అన్నారు. అంతేకాదు.. జగన్ పై ప్రేమతో ఆయన వెంట నడుస్తున్నానని ఇకపై కూడా జగన్ వెంటే ఉంటానని తెలిపారు కాపు రామచంద్రారెడ్డి.

Also read : IAS Srilakshmi : సేవా శిక్ష రద్దు చేయాలని కోరిన ఐఏఎస్ శ్రీలక్ష్మి…కుద‌ర‌ద‌ని పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

మొదటి విడత మంత్రి పదవి దక్కనివారికి రెండవ విడత న్యాయం చేస్తానని జగన్ అప్పుడు అన్నారు. కానీ నాకు రెండవసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు..మంత్రి పదవి వస్తుందని నమ్మకంతో ఉన్నాను.. జిల్లాలోనే వైసీపీలో సీనియర్ గా ఉన్నాను..అయినా నాకు మంత్రి పదవి దక్కలేదని తెలిపిన కాపు సామాజిక సమీకరణాల్లో ఉషశ్రీ చరణ్ కి అవకాశం వచ్చింది..ఇద్దరం సొంత అన్నా చెల్లెల్లు లా ఉంటామని తెలిపారు.

నాకు మంత్రిపదవి ఎందుకు రాలేదో సీఎం జగన్ వివరించారని వివరించారు కాపు. మంత్రి పదవుల విషయంలో సీనియర్లు అర్ధం చేసుకోవాలి అని సీఎం నాతో అన్నారని ఆయన మాటల్ని గౌరవించి అర్థం చేసుకున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో నాకు మంచి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని నా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.

కాగా రెండవసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. పదవులు దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. పదవులు పోయిన వాళ్లు.. దక్కని వాళ్లు అసంతృప్తికి గురయ్యారు. ఇంకా కొంతమంది అలక వీడలేదు. అయితే పదవి దక్కినా .. దక్కకపోయినా పెద్ద సమస్య లేదనుకున్నరా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. మంత్రి పదవి దక్కకపోవటంతో రామచంద్రారెడ్డికి చిక్కులు తప్పడం లేదు. వస్తే మంత్రిగా రా లేకపోతే ఎమ్మెల్యేగా పదవిగా కూడా రాజీనామా చేయమని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. బహిరంగంగానే చెబుతున్నారు. అయినా కాపు మాత్రం జగన్ వెంటే ఉంటానంటున్నారు.

Also read : RK Roja : ‘జగన్ అన్న‌ నమ్మకాన్ని నిలబెడతా’మంత్రిగా రోజా బాధ్య‌త‌ల స్వీక‌రించిన రోజా..దిష్టి తీసిన భ‌ర్త సెల్వ‌మ‌ణి..

కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ రామచంద్రా రెడ్డికి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అనుచరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.మాటతప్పని మడమ తిప్పను అన్న సీఎం ఎన్నికల సమయంలో కాపు రామచంద్రా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానాన్న హామీ ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు.

సొంత పార్టీపై, ఇష్టమైన సీఎం ఆందోళన చేయడం బాధగా ఉందని.. కానీ తమకు అండగా నిలబడ్డ కాపు రామచంద్ర రెడ్డికి మంత్రి పదవి కేటాయించకపోవడం అన్యాయమని వారంటున్నారు. బుధవారం రామచంద్రారెడ్డి అనుచరులంతా బంద్ పిలుపునిచ్చారు. అయితే ఎక్కడా ఎవరూ బంద్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అందుకే వస్తే మంత్రిగా రావాలని లేకపోతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని కాపు రామచంద్రా రెడ్డిపై ఆయన అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

Also read : Andhra pradesh : విశాఖలో క్రిస్టల్ రూపంలో విద్యార్ధులకు డ్రగ్స్ సరఫరా..ముగ్గురు అరెస్ట్

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ జగన్‌కు సన్నిహితులు. ఆయన గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికీ సన్నిహితులే. గాలి జనార్ధన్ రెడ్డి వైపు నుంచి సిఫారసు చేయించుకున్నా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డికి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు మరో సిఫారసు చేయడంతో కాపు రామచంద్రారెడ్డికి అవకాశం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి రాకపోవటంతో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఇంటా బయటా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.