జేసీ ప్రభాకర రెడ్డికి కరోనా పరీక్షలు
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడి అరెస్టైన దివాకర్ ట్రావెల్స్ యజమాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహించారు.
కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. అయితే ఈరోజు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి వస్తున్నారు.
కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించటంతో వీరు కడప సెంట్రల్ జైలులో ఉంటున్నారు.