AP Curfew : మ.12 తర్వాత అన్నీ బంద్.. ఆర్టీసీ బస్సులు కూడా తిరగవు, రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాలకు కర్ఫ్యూ నుంచి సడలింపు ఇవ్వగా.. మధ్యాహ్నం 12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. అంతేకాదు మ.12 తర్వాత ప్రజా రవాణ వాహనాలను కూడా

AP Curfew : మ.12 తర్వాత అన్నీ బంద్.. ఆర్టీసీ బస్సులు కూడా తిరగవు, రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఏపీ కేబినెట్ ఆమోదం

Ap Curfew

AP Curfew : రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా కట్టడికి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాలకు కర్ఫ్యూ నుంచి సడలింపు ఇవ్వగా.. మధ్యాహ్నం 12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. అంతేకాదు మ.12 తర్వాత ప్రజా రవాణ వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేయాలని, ఆర్టీసీ బస్సులను కూడా నడపకూడదని కేబినెట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు కూడా నిలిచిపోనున్నాయి.

మంగళవారం(మే 4,2021) ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు సీఎం జగన్. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. సరిపడ పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొరతను ఎలా అధిగమించాలనే అంశంపైనా చర్చించారు. సుమారు 50 వేల బెడ్ల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఆక్సిజన్ సమస్యపై చర్చ జరగ్గా.. తగిన ఆక్సిజన్‌ ఉన్నప్పటికీ రవాణాకు ట్రక్కుల కొరత వేధిస్తోందని, అందుకే సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అందడంలో జాప్యం జరుగుతున్నట్టు మంత్రులు సీఎంకు తెలిపినట్టు సమాచారం. దీంతో విదేశాల నుంచి కూడా ట్రక్కులు కొనుగోలు చేయాలనే అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు వ్యాక్సినేషన్‌ అంశంపైనా కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో టీకా కొరత ఉండటంతో భారీగా కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లపైనా చర్చించారు. వీటితో పాటు రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కొనుగోళ్లపైనా చర్చ జరిగింది. టూరిజం శాఖకు సంబంధించి పలు అంశాలపైనా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.