CM Jagan: జల జగడంపై జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతోన్న జల జగడంపై ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రి గజేంద్రషెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లే‌ఖ రాశారు.

CM Jagan: జల జగడంపై జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ

Andhra Pradesh Cm Jagan Mohan Reddy Writes To Pm Modi

PM Modi: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతోన్న జల జగడంపై ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రి గజేంద్రషెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లే‌ఖ రాశారు. ప్రధానికి రాసిన 14 పేజీల లేఖలో.. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్‌ తయారీ చేస్తుందని, నీటిని వినియోగిస్తుందని వివరించారు. కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని, శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోట్లేదన్నారు.

జూన్ నెలలో 23, 24 తేదీల్లో రెండు లేఖలు రాశామని, నాగార్జున సాగర్‌లో కూడా తక్కువ నీటి మట్టం ఉన్నా జలవిద్యుత్‌ ఉత్పాదనకు ప్రయత్నిస్తున్నారని లేఖలో జగన్‌ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నా.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోందన్నారు. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని, కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 ఫీట్ల వరకు నీళ్లు ఉంటేనే విద్యుదుత్పత్తికి నీళ్లు వాడుకోవాలని, ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 ఫీట్ల వరకు మాత్రమే నీళ్లున్నాయని, 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా కూగా తెలంగాణ నీళ్లు వాడేస్తోందన్నారు.

తెలంగాణ ప్రాంతంలో పవర్‌ హౌజ్‌ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుదుత్పత్తి పేరిట నీళ్లు వాడేస్తున్నారని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో సీఎం జగన్‌ కోరారు.