AP Corona : ఏపీలో కొత్తగా 3వేల 464 కరోనా కేసులు, 35 మరణాలు

AP Corona : ఏపీలో కొత్తగా 3వేల 464 కరోనా కేసులు, 35 మరణాలు

Ap Corona

AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4వేల 284 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరో 35 మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12వేల 779కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,96,818 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,46,716 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37వేల 323కి తగ్గింది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరుగుతుండటంతో ఊరటనిస్తోంది. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 130, చిత్తూరు జిల్లాలో 597, తూర్పుగోదావరి జిల్లాలో 667, గుంటూరు జిల్లాలో 222, కడప జిల్లాలో 187, కృష్ణాజిల్లాలో 250, కర్నూలు జిల్లాలో 78, నెల్లూరు జిల్లాలో 262, ప్రకాశం జిల్లాలో 349, శ్రీకాకుళం జిల్లాలో 109, విశాఖపట్నం జిల్లాలో 90, విజయనగరం జిల్లాలో 90, పశ్చిమగోదావరి జిల్లాలో 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.