ఏపీలో కొత్తగా 115కరోనా కేసులు.. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,791
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో 12వేల 613 కరోనా పరీక్షలు నిర్వహించగా 115 మందికి పాజిటివ్ వచ్చింది. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209కి చేరుకుంది. కొత్తగా నమోదైన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 33 మంది.. రాష్ట్రంలో స్థానికంగా ఉంటున్న 82 మంది ఉన్నారు.
అయితే గత 24గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,791 కేసులు నమోదవ్వగా, 64 మంది చనిపోయారు. ప్రస్తుతం 927మంది వివిధ కోవిడ్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మొత్తం 64గా ఉంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలో రెండు లక్షలకు దగ్గరగా కరోనా కేసులు చేరుకున్నాయి. దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,598 మంది చనిపోగా.. కేసుల సంఖ్య లక్షా 98వేల 706కి చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్–19తో 204 మంది చనిపోగా.. 8వేల 171 కొత్త కేసులు నమోదయ్యాయి.
Read: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా