MLC: ఏపీలో నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

అంతకు ముందే మరో సీటు ఖాళీగా ఉంది.. దీంతో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను కూడా వైసీపీ భర్తీ చేయనుంది.

MLC: ఏపీలో నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Mlc

MLC: ఇటీవల గవర్నర్‌ కోటా కింద నామినేట్‌ అయిన నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ తో ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు.

ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులు సుచరిత, రంగనాథరాజు, కన్నబాబు, అనిల్, వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా వారం క్రితం ఈ నలుగురిని సీఎం జగన్ ఎంపిక చేసి జాబితాను గవర్నర్‌కు పంపారు. గవర్నర్‌ పరిశీలించి ఈ నలుగురిని ఆమోదించారు. మరోవైపు ఎమ్మెల్యేలల కోటాలో ఎన్నికైన ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల సయమం ముగిసింది.

అంతకు ముందే మరో సీటు ఖాళీగా ఉంది.. దీంతో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను కూడా వైసీపీ భర్తీ చేయనుంది.