వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఉత్తర్వులు : మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇక నుంచి రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఈ ఆర్థికసాయం అందనుంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కింద వైఎస్సార్ కాపు నేస్తం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు ఆరు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా.
అభ్యర్థుల ఎంపికలో నిబంధనలు
మహిళల వయోపరిమితి 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలలోపు, అర్బన్లో రూ.12 వేలలోపు ఉండాలి. కారు ఉండకూడదు. ట్యాక్సీ, మినీవ్యాన్ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తుంటే మినహాయింపు ఇచ్చారు. మూడెకరాల మాగాణీ లేదా పదెకరాల మెట్ట భూమి, లేదా మాగాణి, మెట్ట కలిపి పదెకరాల భూమి ఉండవచ్చు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు. కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నవారు ఉన్నా.. కాపు నేస్తం వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదేళ్లపాటు సాయం అందజేస్తారు.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. వలంటీర్లు అభ్యర్థుల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ సచివాలయం వద్ద లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే మార్చిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమవుతుంది.