High court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరగగా.. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది హైకోర్టు.

High court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

High Court

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరగగా.. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది హైకోర్టు. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఆదేశాలను అమలు చేయట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగస్ట్‌ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశించింది.

నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుట నరేగా నిధులపై విచారణ జరిగింది. వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం విచారించగా.. సీఎస్‌ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది.

అయితే, నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టంచేశారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల హయాంలో సుమారు 2,500 కోట్ల నరేగా నిధులు పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది.