నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు

  • Published By: bheemraj ,Published On : June 11, 2020 / 06:54 PM IST
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు శుక్రవారం (జూన్ 12, 2020) విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్‌ వే హోటల్‌లో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను హాల్‌టికెట్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా https://bie.ap.gov.in/తోపాటు ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఇక మార్కులు, మెమోలు (జూన్ 15, 2020) తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఫలితాలను తొలిసారిగా క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్‌సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ల నిర్వాహకులు వెబ్‌సైట్ పేరు, యూఆర్‌ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి.