Andhra Pradesh : 24 గంటల్లో 5 వేల 674 కరోనా కేసులు, 45 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.

Andhra Pradesh : 24 గంటల్లో 5 వేల 674 కరోనా కేసులు, 45 మంది మృతి

Ap Covid

AP Covid-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 09 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1068 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,42,022 పాజిటివ్ కేసులకు గాను 17,64,509 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో 9 మంది, తూర్పు గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్టణంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇధ్దరు, నెల్లూరులో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 326. చిత్తూరు 854. ఈస్ట్ గోదావరి 1068. గుంటూరు 360. వైఎస్ఆర్ కడప 388. కృష్ణా 435. కర్నూలు 173. నెల్లూరు 235. ప్రకాశం 451. శ్రీకాకుళం 245. విశాఖపట్టణం 215. విజయనగరం 166. వెస్ట్ గోదావరి 758. మొత్తం : 5,674