AP Temperature: ఏపీలో మరో మూడు రోజులు ఎండల తీవ్రత.. ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు

మూడు రోజులు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

AP Temperature: ఏపీలో మరో మూడు రోజులు ఎండల తీవ్రత.. ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు

AP Temperature

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ఉంటుందని చెప్పారు. మంగళవారం అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో, అదేవిధంగా ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 212 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు.

Nadendla Manohar: పవన్ కల్యాణ్ వస్తున్నారు.. పూర్తి వివరాలు చెప్పిన నాదెండ్ల మనోహర్

వడగాల్పులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Andhra Pradesh : టీడీపీలోకి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు …

విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.