Andhrapradesh : 24 గంటల్లో 3,841 కరోనా కేసులు, 38మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేటి వరకు రాష్ట్రంలో 2,20,84,192 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. 24 గంటల్లో 90 వేల 571 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది.

Andhrapradesh : 24 గంటల్లో 3,841 కరోనా కేసులు, 38మంది మృతి

Ap Covid

Andhrapradesh Covid Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేటి వరకు రాష్ట్రంలో 2,20,84,192 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. 24 గంటల్లో 90 వేల 571 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
కృష్ణా జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, విశాఖలో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 141. చిత్తూరు 616. ఈస్ట్ గోదావరి 760. గుంటూరు 313. వైఎస్ఆర్ కడప 350. కృష్ణా 350. కర్నూలు 45. నెల్లూరు 261. ప్రకాశం 296. శ్రీకాకుళం 113. విశాఖపట్టణం 163. విజయనగరం 108. వెస్ట్ గోదావరి 504. మొత్తం : 3,841