AP High Court : ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్

రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

AP High Court : ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్

Ap Hc

AP HC  key instructions on corona treatment bills  : రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని కరోనా పేషెంట్లనుంచి  ప్రైవేటు ఆసుపత్రులు  బిల్లులు భారీగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను దోపిడీ చేయటంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు ఉండాలని తేల్చి చెప్పింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలని పేర్కొంది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స న‌గ‌దుకు సంబంధించి డిస్ ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగిలా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓలను హైకోర్టు ఆదేశించింది.

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుని ప్ర‌వేట్ ఆస్ప‌త్రులు విచ్చ‌లవిడిగా దోపిడీకి తెగబ‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఇటువంటి ఘ‌ట‌న‌లు అనేకం జరిగాయి. ఆఖరికి కోవిడ్ చికిత్స తీసుకునే వ్యక్తి మరణించినా సరే వారి బంధువుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా కనీసం మృతదేహాన్ని కూడా ఇవ్వని ఘటనలు అనేకం జరిగాయి. ఈ క్రమంలో కోవిడ్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి ధర్మాసనం చెక్ పెట్టింది. ఈ సందర్బంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంపై అఖిల భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,91,72,843 శాంపిల్స్ పరీక్షించగా 16,85,142 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 15,08,515 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 10,832 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలో మ‌ధ్యాహ్నం 11 గంట‌ల నుంచి తెల్లారి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ఠిన లాక్ డౌన్ కొన‌సాగుతుంది.