AP Covid-19 Updates: ఏపీలో కొత్తగా 2,765 కరోనా కేసులు, 11 మంది మృతి

ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది కరోనాతో మృతిచెందారు.

AP Covid-19 Updates: ఏపీలో కొత్తగా 2,765 కరోనా కేసులు, 11 మంది మృతి

Andrapradesh Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉండగా.. చిత్తూరులో 496, గుంటూరులో 490 కొత్త కేసులు, విశాఖలో 335, నెల్లూరులో 292 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,892 శాంపిల్స్ పరీక్షించగా.. 2,765 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 1,245 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,53,65,743 మంది నుంచి కరోనా శాంపిల్స్ సేకరించారు. కోవిడ్ వల్ల అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, ప్రకాశంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.